Honour Killing in AP: Man brutally kills his daughtet's Lover చిత్తూరులో పరువు హత్య: యువకుడ్ని చంపి.. ముక్కలు చేసి..

Honour killing in andhra pradesh man brutally kills his daughtet s lover choped into pieces

Honour Killing in pengaragunta, Honour Killing in palamaneru, Honour Killing in chittoor, Honour Killing in Andhra Pradesh, love affair Honour Killing, Honour Killing, Shailaja, DhanShekar, Dhanush, Love affair, Babu, pengaragunta, palamaneru, Chittoor, Andhra Pradesh, Crime

In a case of Honour Killing in Andhra Pradesh, a 23 Year old man was brutally assaulted before hitting with a stick. As he was dead at the spot he throwed him into the well. After 3 days he removed the dead body of the boy and choped it into pieces and burried in his own field.

చిత్తూరులో పరువు హత్య: యువకుడ్ని చంపి.. ముక్కలు చేసిన యువతి తండ్రి

Posted: 05/29/2021 10:03 AM IST
Honour killing in andhra pradesh man brutally kills his daughtet s lover choped into pieces

చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కారణంగా యువకుడిని సినీపక్కీలో చంపి.. ఆ తరువాత ముక్కలు చేసి తన పోలంలో పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తన కుమారుడు కనిపించడం లేదని గత నాలుగు రోజులుగా అన్ని చోట్ల వెతికామని హతుడి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసుల తమ దర్యాప్తును కొనసాగిస్తున్న క్రమంలో ప్రేమ వ్యవహరం కాస్త బయటపడింది. దీంతో యువతితో పాటు అమె తండ్రిని కూడా విచారించిన పోలీసులు తమదైన స్టైల్ లో కూపీ లాగడంతో విషయం బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన బాబు అనే రైతుకు భార్య, కుమారుడు, కూతురు శైలజ ఉన్నారు. పదో తరగతి చదివుతున్న శైలజకు అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ అలియాస్ ధనుష్ (23)తో పరిచయం ఏర్పడి అది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. వీరిద్దరి విషయంపై అనుమానం కలిగిన బాదు తన కూతురితో తిరగవద్దని ధనుష్ ను హెచ్చరించాడు. దీంతో ధనుష్ బెంగళూరుకు వెళ్లిపోయి, అక్కడ డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడు. కాగా, కరోనా లాక్ డౌన్ కారణంగా పెద్దగా పనిలేక ఈ నెల 21న ధనుష్ పెంగరగుంటకు వచ్చాడు.

ధనుష్ వచ్చిన విషయం తెలిసిన శైలజ 22న ఫోన్ చేసి తన తండ్రి పొలానికి వెళ్లాడని ఇంటికి రావాలని కోరింది. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ధనుష్ వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆమె గదిలో మాట్లాడుకుంటున్న సమయంలో పొలం నుంచి వచ్చిన బాబు గమనించాడు. అక్కడ ధనుష్‌ను చూసి తట్టుకోలేకపోయాడు. అదే గదిలో నిద్రిస్తున్న కుమారుడిని లేపి, కుమార్తెతో కలిపి వేరే గదికి పంపాడు. ఆ తర్వాత ధనుష్‌పై కట్టెతో దాడిచేశాడు. ధనుష్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి బైక్ పై చిన్నకుంట గ్రామం వద్దకు తీసుకెళ్లి బావిలో పడేశాడు.

మూడు రోజుల తర్వాత ధనుష్ మృతదేహం పైకి తేలడంతో శవాన్ని పైకి తీసి పక్కనే ఉన్న మల్బరీ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా కోసి తన పొలం పక్కనే ఉన్న మరొకరి పొలంలో రెండు వేర్వేరు చోట్ల వాటిని పాతిపెట్టాడు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని బాబు అంగీకరించడంతో స్థానిక తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం కూడా చేయింది. తన కుమారుడు కనిపించడం లేదనుకున్నాం కానీ.. అసలే లేకుండా పోయాడని అనుకోలేదని విషయం తెలిసిన ధనుష్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి జారుకున్నారు, బాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honour Killing  Shailaja  DhanShekar  Dhanush  Love affair  Babu  pengaragunta  palamaneru  Chittoor  Andhra Pradesh  Crime  

Other Articles