చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కారణంగా యువకుడిని సినీపక్కీలో చంపి.. ఆ తరువాత ముక్కలు చేసి తన పోలంలో పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తన కుమారుడు కనిపించడం లేదని గత నాలుగు రోజులుగా అన్ని చోట్ల వెతికామని హతుడి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసుల తమ దర్యాప్తును కొనసాగిస్తున్న క్రమంలో ప్రేమ వ్యవహరం కాస్త బయటపడింది. దీంతో యువతితో పాటు అమె తండ్రిని కూడా విచారించిన పోలీసులు తమదైన స్టైల్ లో కూపీ లాగడంతో విషయం బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన బాబు అనే రైతుకు భార్య, కుమారుడు, కూతురు శైలజ ఉన్నారు. పదో తరగతి చదివుతున్న శైలజకు అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ అలియాస్ ధనుష్ (23)తో పరిచయం ఏర్పడి అది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. వీరిద్దరి విషయంపై అనుమానం కలిగిన బాదు తన కూతురితో తిరగవద్దని ధనుష్ ను హెచ్చరించాడు. దీంతో ధనుష్ బెంగళూరుకు వెళ్లిపోయి, అక్కడ డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడు. కాగా, కరోనా లాక్ డౌన్ కారణంగా పెద్దగా పనిలేక ఈ నెల 21న ధనుష్ పెంగరగుంటకు వచ్చాడు.
ధనుష్ వచ్చిన విషయం తెలిసిన శైలజ 22న ఫోన్ చేసి తన తండ్రి పొలానికి వెళ్లాడని ఇంటికి రావాలని కోరింది. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ధనుష్ వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆమె గదిలో మాట్లాడుకుంటున్న సమయంలో పొలం నుంచి వచ్చిన బాబు గమనించాడు. అక్కడ ధనుష్ను చూసి తట్టుకోలేకపోయాడు. అదే గదిలో నిద్రిస్తున్న కుమారుడిని లేపి, కుమార్తెతో కలిపి వేరే గదికి పంపాడు. ఆ తర్వాత ధనుష్పై కట్టెతో దాడిచేశాడు. ధనుష్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి బైక్ పై చిన్నకుంట గ్రామం వద్దకు తీసుకెళ్లి బావిలో పడేశాడు.
మూడు రోజుల తర్వాత ధనుష్ మృతదేహం పైకి తేలడంతో శవాన్ని పైకి తీసి పక్కనే ఉన్న మల్బరీ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా కోసి తన పొలం పక్కనే ఉన్న మరొకరి పొలంలో రెండు వేర్వేరు చోట్ల వాటిని పాతిపెట్టాడు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని బాబు అంగీకరించడంతో స్థానిక తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం కూడా చేయింది. తన కుమారుడు కనిపించడం లేదనుకున్నాం కానీ.. అసలే లేకుండా పోయాడని అనుకోలేదని విషయం తెలిసిన ధనుష్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి జారుకున్నారు, బాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more