దేశంలో కరోనా వాక్సీన్ల కొరత ఏర్పడిన తరుణంలో.. కేంద్రప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన యువతకు కూడా మే 1వ తేదీ నుంచి కోవిడ్ వాక్సీన్ ఇవ్వాలని ఏప్రిల్ మాసంలో అదేశాలు జరీ చేయడంతో టీకాలు వేయించుకునేందుకు దేశవ్యాప్తంగా సంఖ్య అధికమైంది. 18 ఏళ్లకు పైబడిన యువతతో పాటు యాభై ఏళ్లకు పైబడిన వయస్కులు.. అందులో విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులు కూడా వుండటంతో ఎవరికి ఏ వాక్సీన్ ఇచ్చామో కూడా చేసుకునే వీలు లేకుండా.. తీసుకున్నా వారికి దానిపై అవగాహన లేకపోవడంతో కరోనా తొలి డోసు ఒక వాక్సీన్ రెండో డోసు మరో వాక్సీన్ ఇచ్చిన దాఖలాలు దేశవ్యాప్తంగా అనేకం నమోదయ్యాయి.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో తొలి డోసు కోవిషీల్డ్ ఇచ్చి రెండో డోసు మాత్రం కోవాగ్జిన్ ఇచ్చారు. అయితే స్థానిక వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందన్న వార్తు.. వారందరినీ పర్యవేక్షిస్తున్నామని అయితే ఎవరిలోనూ ఎలాంటి అరోగ్య సమస్యలు తలెత్తలేదని ఉత్తర్ ప్రదేశ్ వైద్యాధికారులు తెలిపారు. ఇక ఇలాంటి ఘటనలు పలుచోట్ల చోటుచేసుకోవడంతో నీతి అయోగ్ స్పందించింది. తొలి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న ఘటనపై స్పందించిన నీతి అయోగ్. వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజాగా, ఈ విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. రెండు వేర్వేరు డోసులు తీసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవన్నారు. నిజానికి మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటే రెండో డోసు కూడా అదే వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయన్నారు. అయితే, రెండో డోసు ఏదైనప్పటికీ ప్రతికూల ప్రభావం మాత్రం ఉండబోదని తాను చెప్పగలనన్నారు. రెండో డోసు వేసుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి మరింత బలోపేతమవుతుందన్నారు. తొలి డోసు ఏది ఇచ్చారో మలి డోసు కూడా అదే ఇచ్చేలా చూడాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఘటనపై విచారణ జరపాల్సిందేనని పాల్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more