అరేబియా సముద్రంలో లక్షద్వీస్ వద్ద ఏర్పడిన తౌక్టే పెను తుపాను తీవ్రరూపం దాల్చి కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో పెను బీభత్సం సృష్టించిన మీదట నిన్న రాత్రి గుజరాత్ ను తాకింది. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు గుజరాత్ లోని సౌరాష్ట్రలో తీరాన్ని దాటింది. గుజరాత్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రెండు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తక్కువగా వుంది. గుజరాత్ లోనూ తుఫాను ధాటికి ముగ్గరు మృతిచెందారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. తౌక్టే సృష్టించిన విలయంతో రాష్ట్రంలో ఏకంగా 40 వేల భారీ వృక్షాలు నెలకూలాయని, 16వేల 500 పూరిళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు.
కాగా తీరం ధాటిన తరువాత తౌక్టే తుపాను క్రమంగా బలహీన పడుతోందని, అతి తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారిందని, మరో రెండు గంటల వ్యవధిలో ఇది వాయుగుండగా మారుతుందని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అనేక ఇళ్లను నేలకూల్చడంతో వేలాంది మంది నిరాశ్రయులను చేసింది. ఈదురుగాలులు మాత్రం ఇప్పటికీ బలంగా వీస్తున్నాయని, అరేబియా సముద్రంలో అలలు కూడా తుపాను తీరం దాటినా ఇంకా ఎగసిపడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తౌక్టే తుపాను ఇవాళ ఉదయం సౌరాష్ట్ర వద్ద.. దియూ సుమారు 80 కీలోమీటర్ల ఉత్తర ఈశాన్య దిశగా, అమ్రేలికి సుమారు 25 కిలోమీటర్ల దిశగా పయనించిందని అధికారులు తెలిపారు.
ఇక తుపాను ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్, దాద్రి, చాప్రౌలా, హాపూర్, మీరట్, మోదీనగర్, పిలక్వా, కేక్రా, హిండన్ ఏఎఫ్ స్టేషన్, మొరాదాబాద్, హత్రాస్, ఫిరోజాబాద్, బదాయున్, అలిఘర్, సికింద్రా రావు, నరోరా, రాయా, ఐగాల్స్, గులోతి, అరౌలి, కాష్ గంజ్, మధుర, సహాస్ వాన్; నంద్ గావ్, బార్ సానా, కుర్ జా, పహాసు, తుండ్లా, ఆగ్రా, ఈతహా, జాట్టారీ, జజావు, బిలారీ, జహంగిరాబాద్, సదాబాద్, బారౌత్ తదితర ప్రాంతాలల్లో ఓ మెస్తారు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. వీటితో పాటు అటు రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని తెలిపారు.
హర్యానాలోని హోడల్, కోస్లీ, ఝాజర్, ఫారుఖ్ నగర్, బులంద్షహర్, బావల్, నూహ్, తిజారా, చక్రీ, దాద్రి, ఔరంగాబాద్, పాల్ వాల్, రెవరీ, భీవండీ, మనేసర్, సోహ్నా, నార్నుల్, మహేందఘర్ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తాయని తెలిపారు. ఇక ఇటు రాజస్థాన్ లోని బయానా, మెహందీపూర్, అల్వార్, మహ్వా, దౌస, కొట్ పుత్లీ, రాజ్ గర్, విరాట్ నగర్, ఖైర్ థాల్, నాగౌర్, జున్ జున్హు, పిలానీ, నద్బాయ్ తదితర ప్రాంతాల్లోనూ మోస్లారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జాతీయ విప్తతు నివారణ దళం ముఖ్యఅధికారి ఎస్ఎన్ ప్రధాన్ మాట్లాడుతూ గుజారత్ లో మరణాలు సంభవించలేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more