Underworld don Chhota Rajan is alive: Delhi Police చోటారాజన్ మరణించారన్న వార్తల్లో నిజం లేదు: పోలీసులు

Underworld don chhota rajan is alive aiims refutes reports of gangsters death

Underworld don Chhota Rajan, Chhota Rajan dies of Covid-19, Chhota Rajan dies at New Delhi, Chhota Rajan dies of Corona in AIIMS, Gangster Chhota Rajan, coronavirus, All India Institute of Medical Services (AIIMS), Tihar Jail, Bali Indonesia, Corona positive, Covid-19

Underworld don and gangster Chhota Rajan is still alive, says an AIIMS official. The AIIMS officials refuted allegations of his death on Friday. Chhota Rajan was admitted to the hospital on April 26 after he tested positive Covid. The 61-year-old lodged in high-security Tihar prison from 2015 since his arrest at Bali in Indonesia.

గ్యాంగస్టర్ చోటారాజన్ కరోనాతో మృతి.? నిజం కాదన్న పోలీసులు

Posted: 05/07/2021 11:11 PM IST
Underworld don chhota rajan is alive aiims refutes reports of gangsters death

అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి చెందారనే విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. చోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఇటు ఎయిమ్స్ వైద్యులతో పాటు అటు ఢిల్లీ పోలీసులు ఖండించారు. భారత మోస్ట్ వాంటెండ్ జాబితాలో వుండి ఇండోనేషియాలోని బాలిలో అక్కడి పోలీసులకు చిక్కిన చోటా రాజన్ చనిపోలేదని వారు వెల్లడించారు. చోటా రాజన్ కరోనా కాటుతో అసువులు బాసారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎయిమ్స్ వైద్యవర్గాలు వార్తను ఖండించాయి.

2015లో ఇండొనేషియాలోని బాలీలో పోలీసు అధికారులకు చిక్కిన చోటా రాజన్ ను అప్పటి నుంచి కట్టుదిట్టమైన భద్రత కలిగిన తీహార్ జైల్లో ఉంచారు. అయితే ఆయన ఈ సోమవారం కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాల్సి వుండింది. అయితే చోటా రాజన్ ను న్యాయస్థాన వీడియో కాన్పరెన్స్ ఎదుట హాజరుపర్చలేకపోతున్నామని తీహార్ జైలు అధికారులు న్యాయస్థానానికి టెలిఫోన్ ద్వారా సమాచారం అందించారు. అందుకు కారణం ఆయనకు కరోనా సోకిందని, పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్ అని కూడా నిర్థారణ అయ్యిందని జైలు అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో చోటా రాజన్ ను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆయన కరోనా కాటుకు బలయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్తలను అటు జాతీయ మీడియా సహా స్థానిక మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించడంతో అటు ఎయిమ్స్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా స్పందించారు. చోటా రాజన్ కరోనాతో మరణించలేదని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. కాగా చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర నికల్జీ. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న రాజన్.. సుమారు 70 క్రిమనల్ కేసులను ఎదర్కోంటున్నాడు. కాగా 2011లో జర్నలిస్టు జ్యోతిర్మయి దేవ్ హత్య కేసులో న్యాయస్థానం 2018లో ఆయనకు జీవితఖైదు శిక్షను విధించింది. దీంతో పాటు అనేక హత్య కేసులతో పాటు బెదిరింపులకు గురిచేసి డబ్బును లాగే కేసుల్లోనూ చోటా రాజన్ దోషిగా తేలాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhota Rajan  coronavirus  AIIMS  New Delhi  Tihar Jail  Bali Indonesia  Corona positive  Covid-19  

Other Articles