కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వంద రోజులకు పైగా దేశరాజధాని ఢిల్లీ శివార్లలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నా లక్ష్యపెట్టని ప్రభుత్వానికి తామును ఇలానే వదిలేసి.. తమ సహనాన్ని పరీక్షిస్తే లక్ష ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన రైతులు సంఘలు తాజాగా మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమం నాలుగు నెలలు పూర్తి చేసుకోనున్న తరుణంలో తాము భారత్ బంద్ కు పిలుపునిస్తున్నామని రైతు సంఘలు పేర్కెన్నాయి.
కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకునే వరకు తమ అందోళనలు కొనసాగుతూనే వుంటాయని తేల్చిచెప్పిన రైతు సంఘాలు.. దీంతో పాటు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు రానున్న మరికోన్ని రోజుల వ్యవధిలో మరిన్ని అందోళనలకు కూడా పిలుపునిస్తామని తెలిపాయి. తమ భవిష్యత్ నిరసన దీక్షల్లో పలు కార్మిక సంఘాల నేతల నుంచి కూడా మద్దతు లభించిందని పేర్కోన్నాయి. దేశంలో ఇంధన, గ్యాస్ ధరలు భారీగా ఎక్సైజ్ సుంకాన్నిపెంచి సమాన్యులపై భారం వేస్తున్న తరుణంలో వాటిని నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమాల్లో మార్చి 15 నుంచి తమ నిరసనల్లో పాల్గొననున్నాయని తెలిపాయి.
జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఉద్యమంలోని సంఘవిద్రోహశక్తుల్ని రానివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న రైతు సంఘాలు ఆ తరువాత ఫిబ్రవరి 26వ తేదీని అఖిల భారత వర్తక సమాఖ్య ఆధ్వర్యంలో జీఎస్టీ పన్నులను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక మార్చి 26న నాటికి నాలుగు నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలు కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడుతున్నారు. ఇటీవల 100 రోజులను పూర్తి చేసుకున్న నేపథ్యంలోనూ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more