రేణిగుండ విమానాశ్రయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో భాగంగా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నిరసనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పాల్గొనాల్సి వుండటంతో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక బయటకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
కొవిడ్ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పద్నాలుగేళ్లు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.. ప్రతిపక్ష నేతగా వున్న తనను కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఎస్పీ, కలెక్టర్ను కలిసి తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పినా.. పోలీసులు అనుమతించలేదు. పర్యటనకు ఎందుకు వచ్చానో.. తననెందుకు ఎయిర్పోర్టులో నిలిపేశారో మీడియాకు వివరిస్తానని చెప్పినా పోలీసులు అందుకు నిరాకరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని వెల్లడించారు. దీంతో ఆయన విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో తాను ఎన్నికల కమీషన్ నుంచి అనుమతి తీసుకున్న తరువాత కూడా తనను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోడవం.. పోలీసులతో తన గొంతును నొక్కాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరి చర్యగా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరని.. తమ గొంతు నొక్కలేరని ట్విటర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. భయపెట్టి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు. జగన్ ఇంకా రాజకీయ పరిణతి సాధించాలని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more