నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా... అసోంకు మాత్రం మూడు విడతల్లో పోలింగ్ జరగనుందని, కానీ తమ పశ్చిమబెంగాల్లో మాత్రం 8 విడతల్లో పోలింగ్ ఎందుకు నిర్వహిస్తు్న్నారని అమె ప్రశ్నించారు.
అధికార పార్టీ అదుపాజ్ఞనల్లో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఇప్పటికే పలుమార్లు పలు రాష్ట్రాల్లో నిరూపితం అయ్యిందని, అయినా తాము కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పిన అమె.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం బీజేపికి లబ్ది చేకూర్చేందుకే 8 విడతల్లో ఎన్నికలను నిర్వహిస్తోందని అరోపించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి షా సూచనల మేరకు ఈసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని అమె అరోపించారు. ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయాలపై కూడా మమత మండిపడ్డారు.
తాము బలంగా వున్న జిల్లాల్లో ఓట్లు చీలిపోవాలని ఒక్క జిల్లాలో పలు దశల్లో పోలింగ్ నిర్వహించడం ఇది బీజేపి అడిస్తున్న నాటకమేనని అరోపించారు. ఇలాంటి ప్రశ్నలు తాము వేస్తామని తెలిసే సీఈసీ సునీల్ అరోరా.. ముందుగానే ఈ అంశంలో క్లారిటీ ఇవ్వడం గుమ్మడికాయల దొంద చందన్ని గుర్తుచేస్తోందని అన్నారు. క్రితం రోజున నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత సునీల్ అరోరా మాట్లాడుతూ.. గత 2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో 7 విడతల్లో పోలింగ్ జరిగిందని, ఈ సారి 8 విడతల్లో పోలింగ్ జరుగుతుందని.. ఇందులో పెద్ద వింతేమీ లేదని పేర్కోన్నా విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more