నగదు ఉపసంహరణపై మళ్లీ అంక్షలను విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు. కేవలం రూ.1000 మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితులను విధించింది. అంతేకాదు కొత్త రుణాలు, నగదు డిపాజిట్లపై కూడా ఆంక్షలను విధించింది. ఇదేంటి మళ్లీ నోట్ల బదిలీ నాటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది అన్ని బ్యాంకులకు వర్తించడం లేదు. కేవలం కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కు మాత్రమే వర్తించనుంది. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆంక్షలు విధించింది.
ఈ బ్యాంకులోని ఖాతాదారులు కేవలం రూ.1,000 మాత్రమే నగదు విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించింది. దీంతో పాటు ఇకపై బ్యాంకు అధికారులు కూడా ఎవరికీ కొత్తగా రుణాలు ఇవ్వడం, ఎవరి వద్ద నుంచి నగదు డిపాజిట్లు జమ చేసుకోవద్దని అర్బీఐ అదేశాలను జారి చేసింది. అంతేకాదు బ్యాంకు అధికారులు నిధులు సమీకరించుకునే చర్యలతో పాటు కొత్తగా ఎక్కడా పెట్టుబడులు కూడా పెట్టొద్దని అదేశాల్లో పేర్కోంది. ఈ మేరకు ఆర్బీఐ.. బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా విక్రయించొద్దని స్పష్టం చేసింది. ఎలాంటి చెల్లింపులు కూడా చేయొద్దని ఆదేశించింది.
తాము జారీ చేసిన ఆంక్షలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని, ఇవి ఆరు మాసాల పాటు అమల్లో కొనసాగుతాయని అర్బీఐ వెల్లడించింది. బ్యాంకు అర్థిక పరిస్థితి మెరుగయ్యే కోద్దీ ఆంక్షలను సడలిస్తామని అర్బీఐ తెలిపింది. అయితే, బ్యాంకు ఖాతాదారుల్లో 99.58 శాతం మంది ఖాతాదారులు ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కోఆపరేషన్(డీఐసీజీసీ)’ కింద నమోదై ఉన్నారని.. వారందరికీ బీమా రూపంలో భద్రత లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఆంక్షలు విధించినంత మాత్రాన బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినట్లు కాదని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు కొన్ని పరిమితులు కొనసాగుతాయని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more