Petrol price touches record high of Rs 88.73 per litre in Delhi సెంచరీ మార్క్ దిశగా పరుగులు పెడుతోన్న ప్రెటో బాంబ్..

Petrol diesel prices hiked for 7th successive day scale new highs

oil price, crude oil, price hike, petrol, diesel, premium petrol price, sriganganar, rajasthan, petrol price in delhi, petrol price in mumbai, petrol price in chennai, petrol price in kolkatta, petrol price in hyderabad, petrol price in amaravati, dissel price in delhi, dissel price in mumbai, dissel price in chennai, dissel price in kolkatta, dissel price in hyderabad, dissel price in amaravati, regular petrol price, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices were revised across the country for the Seventh straight day on Monday. The state-run Oil Marketing Companies (OMC) hiked petrol and diesel prices by 26 paise per litre respectively. With this latest hike, one litre of petrol in Delhi is selling at a fresh record high of Rs 88.73, while diesel in the national capital is retailing at Rs 79.35 per litre, up by 29 paise respectively.

సెంచరీ మార్క్ దిశగా పరుగులు పెడుతోన్న ప్రెటో బాంబ్..

Posted: 02/15/2021 12:30 PM IST
Petrol diesel prices hiked for 7th successive day scale new highs

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగుతున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరల పెంపు అనివార్యం అవుతోంది. ఈ క్రమంలో వరుసగా ఏడవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధర రూ. 88.73కు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర పెరగడంతో ఇంధన ధరలకు పెట్రో సంస్థలు పెంచాయి. క్రూడ్ అయిల్ ధర ఒక్క డాలర్ పెరగిన నేపథ్యంలో భారత ఇంధన సంస్థలపై సాలినా రూ.10700 కోట్ల భారం పడుతోంది. ఇక దీనికి తోడు ప్రస్తుతం మధ్యపాశ్చ దేశాలలో నెలకొన్న ఆందోళనలు కూడా ఈ ధరల పెంపుకు కారణం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో క్రూడ్అయిల్ ధర 63కు డాలర్ల చేరవకు చేరడం ఇంధన ధరలపై ప్రభావాన్ని చూపింది. కాగా ధరలు తగ్గిన సమయాల్లో ఆ ప్రయోజనాలను వాహనదారులకు అందకుండా మధ్యలో దేశాభివృద్దికి కోసమని కేంద్రం, రాష్ట్రాభివృద్దికని రాష్ట్రప్రభుత్వాలు ఎక్సైజ్ సన్నులు, వ్యాట్ లు విధిస్తూ.. కొత్త మార్గాలను అనుసరిస్తూన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన క్రమంలో వాటి భారాన్ని వాహనదారులపై మోపే ప్రభుత్వాలు.. ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించే చర్యలకు పూనుకోకపోవడం వాహనదారులను ఇబ్బందులను గురిచేస్తోంది.

వరుసగా ఏడో రోజ పెరిగిన ఇంధన ధరల పెంపు వాహనదారులను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ పెట్రోల్ పై రూ.0.26 డీజిల్ పై రూ.0.29 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలోనే మునుపెన్నడూ లేని గరిష్ట రికార్డు స్థాయికి పెట్రోల్ ధర చేరుకుంది. దేశంలో మునుపెన్నడే లేని విధంగా పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర విధించిన పన్నులను కాసింత మినహాయించాలని వాహనదారుల నుంచి వినతతులు వ్యక్తమవుతున్నాయి. కాగా పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం, పన్నులను తగ్గించే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది.

తాజా పెంపుతో ఇంధన ధరలు సెంచరీ మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతుండటం.. వాటి ప్రభావం నేరుగా వాహనదారులపై.. పరోక్షంగా నిత్యావసర సరుకులపై పడటంతో యావత్ దేశప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కూరగాయాలు, ఆహారాధన్యాల ధరలు ఆకాశానంటుతున్నాయి. హైదరాబాద్ లో ఇంధన ధరలు ఏకంగా మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయిని అందుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధర లీటరు రూ.92 దాటి పరుగులు పెడుతోంది. ఇక బ్రాండెడ్ పెట్రోల్ ధర తొంభై ఆరు రూపాయలను అందుకుని ముందుకు దూసుకెళ్తోంది.

తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.88.73,  డీజిల్‌ రూ.79.35
కోల్ కతాలో లీటరు పెట్రోల్ రూ.90.25, డీజిల్‌రూ. 82.94
ముంబైలో లీటరు పెట్రోల్  రూ.95.46, డీజిల్‌ రూ.86.34
చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.91.19, డీజిల్ రూ.84.44
బెంగళూరులో లీటరు పెట్రోల్‌ రూ.91.40, డీజిల్‌ రూ.83.47
హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ.92.53, డీజిల్‌  రూ. రూ.86.55
విశాఖపట్నంలో లీటరు పెట్రోలు రూ.93.39 డీజిల్‌  రూ. రూ.86.84
అమరావతిలో లీటరు పెట్రోల్ రూ. రూ.95.13 డీజిల్‌  రూ.88.63కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol prices  VAT  Diesel price  fuel retailers  global crude oil prices  Oil price  diesel  Petrol  Hyderabad  

Other Articles