రాష్ట్రంలోని 72 మునిసిపాలిటీల్లో 159 బార్ల ఏర్పాటుకు జనవరి 25న ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా, మొత్తం 7,380 దరఖాస్తులు వచ్చాయి. ఇక పాత బార్లలో తొర్రూరులో ఉండే ఒకే బార్ కు అత్యధికంగా 278 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మునిసిపాలిటీ బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. నేరేడుచర్ల మునిసిపాలిటీలో ఒకే ఒక్క బార్ కు పర్మిషన్ ఇవ్వగా, దీన్ని సొంతం చేసుకునేందుకు ఏకంగా 248 దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తు ఫీజుతోనే ఖజానాకు రూ. 73.78 కోట్ల ఆదాయం లభించింది.
రెండు రోజుల క్రితమే దరఖాస్తులకు గడువు ముగియడంతో ఇవాళ డ్రా ద్వారా బార్లను కేటాయించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మునిసిపాలిటీల్లో మాత్రమే బార్ల ఏర్పాటుకు అతి తక్కువ స్పందన కనిపించింది. నిజామాబాద్ లో ఏడు బార్లకుగాను 7, బోధన్ లో మూడు బార్లకు గాను మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 బార్లకు గాను 1,074 దరఖాస్తులు వచ్చాయి. పది కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లు 147 ఉన్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో నూతన మునిసిపాలిటీల్లో ఐదు బార్లు నోటిఫై చేయగా, 638 దరఖాస్తులు వచ్చాయి.
ఇక యాదగిరిగుట్ట పరిధిలో ఒకే బార్ ఉండగా, దీనికి 277 మంది పోటీ పడ్డారు. దీంతో ఈ బార్ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ డ్రా అనంతరం గెలిచిన వారికి 17న షాపులను కేటాయించనున్నారు. ఆపై మూడు నెలల్లోగా ఎక్సైజ్ శాఖ సూచించే నిబంధనలను బార్లు పొందిన యజమానులు పూర్తి చేయాల్సి వుంటుంది. జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రా జరగింది. ఇదిలావుండగా అటు మద్యం దుకాణాలు, ఇటు బార్లతోనే రాష్ట్రానికి భారీగా అదాయం సమకూర్చుకోవడంపై ఇప్పటికే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more