కరోనా మహమ్మారితో కుదేలైన సామాన్యులపై అటు ప్రభుత్వం, ఇటు ఇంధన సంస్థలు ధరాఘాతాలతో దాడి కోనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలపై గత ఏడేళ్లుగా విధించిన అదనపు ఎక్సైజ్ పన్నులతో వాహనదారులు తమ వాహనాలను ఇళ్లకు పరిమితం చేసి.. ప్రజారవాణ బాటపడుతున్నారు. ఇదిచాలదన్నట్లు ఇక వంటింట్లోని మహిళలను కూడా ఇంధన సంస్థలు టార్గెట్ చేశాయి. ఇప్పటి వరకు రెండు నెలలకో పర్యాయం పెరుగుతూ వస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇకపై వారం వారం బాదేందుకు ఇంధనసంస్థలు రెడీ అయ్యాయి.
గ్యాస్ ధరల విషయంలో పెట్రోలు, డీజిల్ పద్ధతిని అనుసరించాలని యోచిస్తున్న కేంద్రం.. ఈ మేరకు ఇంధన సంస్థలకు ముందుగా వారం వారం ధరలను సమీక్షించేందుకు అనుమతినిచ్చిందని సమాచారం. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా గ్యాస్ ధరలను వారానికి ఒకసారి మార్చాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించింది. గతేడాది డిసెంబరులో రెండుసార్లు గ్యాస్ ధరలను పెంచిన ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్పై ఏకంగా రూ. 100 పెంచింది. ఇటీవల బడ్జెట్ నేపథ్యంలో గ్యాస్ ధరలపై కేంద్రం సబ్సీడీని మరింత తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి.
గ్యాస్ ధరలను భారీగా పెంచినా.. సబ్సీడీలను ఎత్తివేస్తూ నిర్ణయాలు తీసుకున్నా ఇటు ప్రజల నుంచి కానీ, అటు ప్రతిపక్షా నుంచి కానీ ఏమాత్రం వ్యతిరేకత రాకపోవడంతో.. ఇక జనవరి నుంచి వారానికో పర్యాయం పెరుగుతున్న గ్యాస్ ధరలను.. ఇక మరో రెండు నెలలు అంటే ఏప్రిల్ మాసం నుంచి రోజు వారీ ధరల సవరణ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని సమాచారం. ఈమేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన సంస్థలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు వారానికో పర్యాయం సవరణలు జరగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more