తన కోసమే తన శత్రువు అన్న విషయం తెలిసినా.. మనిషులు మాత్రం తమ కోపాన్ని అదుపు చేసుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. ఈ క్రమంలో అవేశకామేశాలకు లోనై వారు తీసుకునే నిర్ణయాలతో పెద్ద మూల్యాన్ని ప్రతిఫలంగా అనుభవిస్తుంటారు. ఇలాంటిదే ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన రోగికి వైద్యం చేసిన తరువాత ఫీజు అడిగితే.. అవేశానికి గురైన రోగి.. వైద్యుడి వేలును నరికి అతని చేతిలో పెట్టాడు. క్లినిక్ సిబ్బంది పిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలోని కుండిపుర పోలిస్ స్టేషన్ పరిధిలోని శనిచంద్ర మార్కెట్ లో డాక్టర్ ఎస్.కె బింద్రాకు చెందిన క్లినిక్ వుంది. ఈ క్లినిక్ కు విజయ్ ఉల్కా అతని స్నేహితుడు ఆకాష్ తివారీ శనివారం అర్థరాత్రి సమయంలో వచ్చి చికిత్స చేయించుకున్నారు. చికిత్స ముగిసిన తరువాత వైద్యుడు ఫీజు అడిగితే అతనితో వాదోపవాదానికి దిగారు. వైద్యుడైన బింద్రా తమ నుంచి అధిక మొత్తంగా ఫీజు డిమాండ్ చేస్తున్నాడని క్లినిక్ లోనే తీవ్రస్థాయిలో మండిపడ్డ రోగులు.. క్లినిక్ లోని సామాగ్రిని చిందరవందర చేశారు.
అప్పటికీ వారి క్లినిక్ సిబ్బంది వారిస్తున్నా వారు వైద్యుడు బింద్రాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన బింద్రా చేతి వేలిని బాధితుడితోపాటు వచ్చిన విజయ్ తివారీ అనే వ్యక్తి కొరికి చేతి నుంచి వేలిని వేరు చేసి అతని చేతిలోనే పెట్టి ఇదే ఫీజుగా భావించాలని అన్నారు. దీంతో క్లినిక్ లోని సిబ్బంది పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన విజయ్ ఉల్కా అతని స్నేహితుడు అకాశ్ తివారీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వైద్యుడు బింద్రాను చికిత్స నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more