కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో అర్థికంగా చితికిపోయిన సగటు బ్యాంకు ఖాతాదారులను ఇప్పడు బ్యాంకులు కూడా కుదేలయ్యేలా చేస్తున్నాయి, వాక్సీన్ వస్తుందన్న ఆశ, కరోనా విజృంభనలో నెమ్మదించిన వేగంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నఖాతాదారులపై ఎడాపెడా చర్జీలతో బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి దానికి ఏదో ఒక ఛార్జ్ వసూలు చేస్తూ వినియోగదారుడి వీపు విమానం మోత మోగిస్తున్నాయి. దేనికి ఏ ఛార్జీ వసూలు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో బ్యాంకు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
గత కొన్నేళ్ల క్రితం ఏ బ్యాంకు శాఖలో చెక్కును అదే బ్యాంకు శాఖలో విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చేంది. కానీ ఈ మధ్యకాలంలో అంతా అన్ లైన్ కావడంతో ఒక బ్యాంకుకు చెందిన ఆ బ్యాంకులోని ఏ శాఖలోనైనా విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. తాజాగా దీనిపై కూడా ఇటీవలి కాలంలో బ్యాంకులు ఎడాపెడా బాదేస్తున్నాయి. ఒకే బ్యాంకు అయినా ఆ శాఖలో కాకుండా ఇతర శాఖలో డబ్బులు విత్ డ్రా చేస్తే.. అందుకుగాను ఏకంగా వెయ్యికి ఐదు రూపాయల చోప్పున చార్జీలను విధిస్తున్నారు. దీంతో అదే బ్యాంకు చెందిన ఇతర శాఖ నుంచి డబ్బులు విత్ డ్రా ఖాతాదారుడి జేబుకు చిల్లు పడక తప్పడం లేదు.
ఇక డబ్బులు వేసినా, తీసినా బాదుడే ఉంటోంది. కరోనా నేపథ్యంలో నగదు నిర్వహణ భారం పెరిగిందనే సాకు చూపి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. గత నవంబర్ 1 నుంచే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పద్ధతులను పాటిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకు ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వీలుండేది. ఇప్పుడు వాటిని మూడింటికి తగ్గించారు. పొదుపు ఖాతాలపై ప్రస్తుతం 2 శాతం వడ్డీ లభిస్తోంది. ఫిక్సుడు డిపాజిట్లపై స్వల్ప కాలానికి 3 శాతానికి మించి రావడం లేదు.
ఇదే సమయంలో నగదు డిపాజిట్లపై వేస్తున్న ఛార్జీలు అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. రూ. 2 లక్షల పరిమితి మించితే ప్రతి వెయ్యికి రూ. 2 చొప్పున ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులు రూ. 2 నుంచి 5 వరకు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం, నేరుగా ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు రూ. 2 లక్షలు దాటితే ఛార్జీలు వేస్తున్నారు. బ్యాంకుల బాదుడుపై వినియోగదారులు మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more