తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బెయిల్ వస్తుందన్న భూమా అఖిలప్రయి మద్దతుదారుల ఆశలపై న్యాయస్థానం నీళ్లు చల్లింది. కిడ్నాప్ కేసులో అరెస్టైన అమె గర్భవతి అని అమెకు నిత్యం వైద్యుల పర్యవేక్షణ అవసరమని అమె తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా న్యాయస్థానం అమె బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. వ్యక్తుల అపహరణ కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న వ్యక్తులకు అంత త్వరగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన సికింద్రాబాద్ కోర్టు విచారణ ముందు అమె తరపు న్యాయవాదులు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కావాలనే కేసులో ఇరికించారని అఖిలప్రియ తరుపు న్యాయవాదులు వాదించగా… అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను మార్చే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. జైలులో అఖిలప్రియ కిందపడడంతో ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయగా.. తక్షణమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
దీంతో జైలు అధికారులు అఖిలప్రియను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అమెకు బెయిల్ నిరాకరించింది. అఖిల ప్రియతో పాటు ఆమె భర్త, అనుచరులను అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని.. దాంతో పాటు సంతకాలు చేయించుకున్న దస్త్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇక అదే సమయంలో అఖిలప్రియను న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ నెల 13 వరకు అమెను పోలీసుల కస్టడీకి అప్పగించింది. దీంతో పోలీసులు అమెను తమ కస్టడీలోకి తీసుకుని అమెను ప్రశ్నించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more