(Image source from: Twitter.com/somuveerraju)
రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హిందూ సంప్రదాయాలపై, హిందూ దేవాలయాలపై ఎలాంటి గౌరవం, నమ్మకం లేకుండా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. హిందూ దేవాలయాలపై క్రమం తప్పకుండా దాడులు జరుగుతున్న పరిణామాలు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు, హిందువుల మనోభావాలను అవహేళన చేసే విధంగా ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు, రామతీర్థం ధర్మయాత్రకు ముందుగానే పిలుపునిచ్చినప్పటికీ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.
విజయనగరం జిల్లాలో కొదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపి, జనసేన సంయుక్తంగా రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి, ఈ పిలుపుమేరకు ఇవాళ రామతీర్థానికి వెళ్తున్న బీజేపి, జనసేన నేతలను తెల్లవారుజామునుంచే పోలీసులు గృహనిర్భంధం చేశారు, ఇక విజయనగరం చేరకున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా ధర్మయాత్రలో పాల్గోనకుండా అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. సెక్షన్ 30 అమల్లో వున్నందున ఎలాంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు, సోమువీర్రాజుతో పాటు పలువురు బీజేపి నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల ఠాణాకు తరలించారు.
ధర్మ రక్షణ కోసం @BJP4Andhra మరియు @JanaSenaParty సంయుక్తముగా ఈరోజు కార్యక్రమాన్ని తలపెడితే .. మమ్మల్ని మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులని, మా కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేస్తారా ? (2/3)#SaveHinduTemplesInAP pic.twitter.com/F8INLkxkqC
— Somu Veerraju (@somuveerraju) January 5, 2021
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపి, జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు, కొదండరాముడి ఆలయంలో జరిగిన ఘటనను నిరసిస్తూ తాము చేపట్టిన ధర్మయాత్రకు ఎందుకు వున్నఫళంగా అనుమతులను నిరాకరించారని బీజేపి నేతలు ప్రశ్నించారు. అధికార వైసీపీ, విఫక్ష టీడీపీ నేతలను అనుమతించిన ప్రభుత్వం, పోలీసు యంత్రాం.. జనసేనతో పాటు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు, వెంటనే గృహనిర్భంధంలో వుంచిన బీజేపి, జనసేన నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా విశాఖలోని బీజేపి కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లను విశాఖ ఏసీపీ మూర్తి, శ్రావణ్ కుమారులు అడ్డుకున్నారు.
#SaveTemplesInAP pic.twitter.com/dMNGXLC5Sg
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) January 5, 2021
కోదండ రామస్వామి విగ్రహ శిరచ్ఛేదన దుస్సంఘటనను ఖండిస్తూ తాము చేపట్టిన యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోన్న తీరును ఖండిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న రాత్రి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన వ్యవహారాల కమిటీ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరించడం ప్రారంభించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారు జాము నుంచే నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని ఆయన అరోపించారు.
(Video Source: NTV Telugu)
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more