(Image source from: Twitter.com/somuveerraju)
రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హిందూ సంప్రదాయాలపై, హిందూ దేవాలయాలపై ఎలాంటి గౌరవం, నమ్మకం లేకుండా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. హిందూ దేవాలయాలపై క్రమం తప్పకుండా దాడులు జరుగుతున్న పరిణామాలు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు, హిందువుల మనోభావాలను అవహేళన చేసే విధంగా ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు, రామతీర్థం ధర్మయాత్రకు ముందుగానే పిలుపునిచ్చినప్పటికీ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.
విజయనగరం జిల్లాలో కొదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపి, జనసేన సంయుక్తంగా రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి, ఈ పిలుపుమేరకు ఇవాళ రామతీర్థానికి వెళ్తున్న బీజేపి, జనసేన నేతలను తెల్లవారుజామునుంచే పోలీసులు గృహనిర్భంధం చేశారు, ఇక విజయనగరం చేరకున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా ధర్మయాత్రలో పాల్గోనకుండా అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. సెక్షన్ 30 అమల్లో వున్నందున ఎలాంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు, సోమువీర్రాజుతో పాటు పలువురు బీజేపి నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల ఠాణాకు తరలించారు.
ధర్మ రక్షణ కోసం @BJP4Andhra మరియు @JanaSenaParty సంయుక్తముగా ఈరోజు కార్యక్రమాన్ని తలపెడితే .. మమ్మల్ని మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులని, మా కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేస్తారా ? (2/3)#SaveHinduTemplesInAP pic.twitter.com/F8INLkxkqC
— Somu Veerraju (@somuveerraju) January 5, 2021
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపి, జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు, కొదండరాముడి ఆలయంలో జరిగిన ఘటనను నిరసిస్తూ తాము చేపట్టిన ధర్మయాత్రకు ఎందుకు వున్నఫళంగా అనుమతులను నిరాకరించారని బీజేపి నేతలు ప్రశ్నించారు. అధికార వైసీపీ, విఫక్ష టీడీపీ నేతలను అనుమతించిన ప్రభుత్వం, పోలీసు యంత్రాం.. జనసేనతో పాటు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు, వెంటనే గృహనిర్భంధంలో వుంచిన బీజేపి, జనసేన నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా విశాఖలోని బీజేపి కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లను విశాఖ ఏసీపీ మూర్తి, శ్రావణ్ కుమారులు అడ్డుకున్నారు.
#SaveTemplesInAP pic.twitter.com/dMNGXLC5Sg
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) January 5, 2021
కోదండ రామస్వామి విగ్రహ శిరచ్ఛేదన దుస్సంఘటనను ఖండిస్తూ తాము చేపట్టిన యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోన్న తీరును ఖండిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న రాత్రి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన వ్యవహారాల కమిటీ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరించడం ప్రారంభించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారు జాము నుంచే నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని ఆయన అరోపించారు.
(Video Source: NTV Telugu)
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more