ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.? అయితే నెలసరి వాయిదాల్లోనైనా పర్వాలేదు కానీ వెంటనే కొనేయండీ.. ఎందుకంటే ఇకపై ఆ వస్తువులు కొనాలంటే ఏకంగా 25 నుంచి 30 శాతం మేర ధరను అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. అదేంటీ అంతలా ధరలు ఎందుకు పెరుగుతాయ్.. అన్న సందేహాలు రేగుతున్నాయా.? నిజమేనండీ ఎలక్ట్రానిక్ వస్తువుల ముడిసరుకుల రేట్లు (ఇన్పుట్ కాస్ట్స్) 15 నుంచి 40 శాతం మధ్య పెరగడంతో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ధరలు కూడా ఇక పెరగక తప్పడం లేదు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రో ఓవెన్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు దాదాపు 25 నుంచి 40 శాతం పెరగనున్నాయి.
ఎందుకిలా అంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లో వినియోగించే ముడిసరుకులైన కాపర్, జింక్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ వంటి వాటి రేట్లు పెరిగాయని, వీటి షిప్ మెంట్ చార్జీలు కూడా పెరిగాయని దీంతో ధరలు పెరుగుదల అనివార్యమని అంటున్నారు నిపుణులు. అలాగే, టీవీ ప్యానెళ్ల ధరలు 30 నుంచి 100 శాతం మధ్య పెరిగినట్లు వివరించారు. గ్లోబల్ మార్కెట్లో వీటి కొరత ఉండడంతో ఈ పరిస్థితి ఉందని చెప్పారు. భారత్లో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయా సంస్థలకు ముందే తెలిసినప్పటికీ పండుగ సీజన్లో ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ధరలను పెంచకుండా వాయిదా వేస్తూ వస్తున్నాయని తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఎలక్ట్రానిక్ కంపెనీలు ధరలు పెంపుకు శ్రీకారం చుట్టనున్నాయని, జనవరి నుంచి పెంచి ధరలతోనే విక్రయాలు సాగనున్నాయని ఓ నిపుణుడు తెలిపారు. ఏళ్ల తరువాత గణనీయంగా ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించనుందని వివరించారు. వాషింగ్ మిషన్లు, ఏసీలు 8 నుంచి 10 శాతం, రిఫ్రిజిరేజర్లు, చెస్ట్ ఫ్రీజర్లు 12 నుంచి 15 శాతం, టెలివిజన్ ధరలు 7 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో వినియోగించే కాపర్, జింక్, అల్యూమినియం ధరలు గత నాలుగు నెలలగా ఏకంగా 40-45 శాతం మేర పెరిగాయని అయినా పండగ నేపథ్యంలో ధరలను పెంచడం భావ్యం కాదని మిన్నకుండిపోయినట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more