కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో భారత్ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు విరివిగా పాల్గోని రైతులకు తమ మద్దత్తును చాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించడంతో ఉదయం నుంచే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి బంద్ సంపూర్ణంగా, విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంతో ఇదివరకే పలు పర్యాయాలు చర్చలు జరిపి.. హస్తిన శివార్లలోని సింఘం ప్రాంతంలో తిష్టవేసుకుని.. తమ వెంట తెచ్చుకున్న ఆహారధాన్యాలతో రహదారుల పక్కనే వంటవార్పు చేసుకుని.. వెన్నులో చలి చేరుతున్నా.. మెక్కవోని ధైర్యంతో గత 13 రోజులుగా అక్కడే గడుపుతున్నారు. ఈ క్రమంలో రైతుల దీక్షలను నకీలీల దీక్షలని పలు వీడియోలు, దినసరి కూలీలను రైతులుగా చేపుతున్నారన్న వీడియోలను నెట్టింట్లో వస్తున్నా.. ఎవరెంతగా గోబెల్స్ ప్రచారం చేసినా.. తమ ఉనికిని దెబ్బతీయలేరని, వాటిని పట్టించుకోకుండా తమ డిమాండ్ల పరిష్కారం కోసమే పోరాడుతున్నారు రైతన్నలు. దీంతో దేశవ్యాప్తంగా సాయుధ బలగాలను మోహరించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి షాద్నగర్ బూర్గుల గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.#FarmersProtest #BharatBandh pic.twitter.com/neig8goGwB
— TRS Party (@trspartyonline) December 8, 2020
కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రైతాంగం ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మద్దతుగా పెబ్బేరులో జరుగుతున్న రాస్తారోకోకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు#trspartywithformers #Bharathbandh pic.twitter.com/qrUpgSeKKG
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) December 8, 2020
ఇటు తెలంగాణాలో మంత్రులు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఎక్కడికక్కడ బంద్లో పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు రాజుగా మారుతాడని చెప్పిన బీజేపి పాలకులు., రైతును కార్పోరేట్ బానిసలుగా మార్చడానికే చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. రైతులకు మేలు చేస్తున్నట్లుగా ఎకరానికి కొంత సొమ్మునిస్తూనే.. వారికి తెలియకుండానే కార్పోరేట్ కంపెనీల అధిపత్య గుప్పట్లోకి వారిని పంపే ప్రయత్నం వ్యవసాయ చట్టాలతో జరుగుతోందని అరోపించారు. ఈ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
इस देश का किसान हमारी शान है।
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2020
We stand in support of our farmers and their call for #BharatBandh. Government must ensure that our farmers are secure. #TRSWithFarmers pic.twitter.com/6mCUOdbALj
ఆర్.సి.పురం అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా శ్రీ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది #SaveFarmersFromModi @KomatireddyKVR @manickamtagore @CilarapuDamodar @UttamTPCC @INCTelangana @revanth_anumula pic.twitter.com/zbrHMALQ5L
— Kata Srinivas Goud (@kata_SrinuGoud) December 8, 2020
షాద్ నగర్ లో కేటీఆర్, తుప్రాన్ లో హరీశ్ రావు, వరంగల్ లో ఎర్రబెల్లి, అలంపూర్ లో నిరంజన్, హుజురాబాద్ లో ఈటెల, ఖమ్మంలో పువ్వాడ, కరీంనగర్ లో గంగుల, కామారెడ్డిలో కవిత భారత్ బంద్ లో పాల్గోని నిరసన తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి, ఉదయం నుంచే రవాణా సర్వీసులకు బ్రేకులు పడ్డాయి, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్ష నేతలు ధర్నా నిర్వహించి రోడ్డుపై భైఠాయించారు, సీఫీఐ రామకృష్ణ, సీపీఎం మధు సహా పలువురు నేతలు ర్యాలీగా వచ్చి రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు, భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేశారు, అటు విశాఖపట్పంలోనూ వామపక్ష పార్టీలు రైతులకు సంఘీభావంగా రాస్తోరోకో నిర్వహించాయి.
APCC President Dr. @sailajanath Garu leading the protests against the BJP government's anti-farmer bills. The Congress party is always in solidarity with the farmers of India. #BharatBandh pic.twitter.com/FV2xlnUrW2
— INC Andhra Pradesh (@INC_Andhra) December 8, 2020
Congress leaders and supporters from across Andhra Pradesh take part in the #BharatBandh to express solidarity with India's farmers. pic.twitter.com/HVFMUaUPGO
— INC Andhra Pradesh (@INC_Andhra) December 8, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more