(Image source from: Twitter.com/TelanganaCMO)
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మంగళవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన ఆయన అంత్యక్రియలను ఇవాళ కుటుంబసభ్యులు నిర్వహించారు. నల్గోండ జిల్లా నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించిన ఆయన అంత్యక్రియలకు అక్కడి ప్రజలు కూడా పెద్దసంఖ్యలో హాజరయ్యారు, ఎమ్మెల్యే కన్నా ముందు పదేళ్ల కాలం పాటు ఆయన నకిరేకల్ మండల అధ్యక్షుడి హోదాలోనూ ప్రజలకు సేవలు అందించారు. ఆ తరువాత ఎమ్మెల్యేగానే అక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చివరి చూపు కోసం స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నల్గొండ జిల్లా అభివృద్దిలో తన వంతు సాయాన్ని అందించిన ప్రజానాయకుడు అని కీర్తించిన ప్రజలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పాలెం గ్రామానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ నోముల నర్సింహయ్య బౌతికకాయంపై పుష్పగుచ్చాని ఉంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నోముల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. తమ పార్టీ నోముల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అభయానిచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు నేతలు నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరై భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. pic.twitter.com/fnIAi6JjK1
— Telangana CMO (@TelanganaCMO) December 3, 2020
ఈ ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామం చేరుకున్న సీఎం కేసీఆర్... నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో మరణించిన నోముల నర్సింహయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. నోముల నర్సింహయ్య హైదరాబాదులో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన నోముల అన్ని రంగాలలో ముక్కుసూటి మనిషిగా వ్యవహరించారు. నోముల అంత్యక్రియలు ఆయన స్వంత వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more