కార్మికనేత, ఉద్యమ యోధుడు, కార్మిక జనపక్షపాతి, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాలు ముగిసాయి. కరోనా నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలోనే బంధువులు, అనుయాయువులు, కార్మిక సంఘ నేతలు, టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, మంత్రులు, కుటుంబసభ్యులు మధ్య ఆయన దహన సంస్కారాలు ముగిసాయి, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రాష్ట్రప్రభుత్వం అధికార లాంచనాల మధ్య ఆయనకు తన బౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నాయిని నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాల్లో పాల్గోన్న మంత్రి కేటీఆర్.. ఆయన పాడెను కూడా తన భుజాలపై మోసి.. ఆయన పట్ల వున్న ప్రేమను చాటుకున్నారు.
అంతకుముందు బజారాహిల్స్ లోని రోడ్డు నెంబరు 12 నుంచి ఫిల్మ్ నగర్ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గోని ఆయన పాడెను మోసారు, ఈ అంతిమయాత్రలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, మహమూద్ అలి, సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటరీ సభ్యుడు కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మెహన్ పలువురు కార్పోరేటర్లు పాల్గోన్నారు. అంతిమ సంస్కారాల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు. అంతక్రియలకు హాజరైన నేతలు నాయిని నర్సింహారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అస్వస్థతతో గత అర్ధరాత్రి మృతి చెందారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న ఆయన, ఆ తర్వాత శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోన్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఈ నెల 13న ఆయనను హుటాహుటిన అపోలో అసుపత్రికి తరలించిచారు. అయితే న్యూమోనియా బారిన పడ్డారని పరీక్షల ద్వారా తెలుసుకున్న వైద్యులు ఎక్యూట్ ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందించారు. అయితే క్రమంగా ఆయన అరోగ్యపరిస్థితి విషమిస్తూ రావడంతో ఆయన కుటుంబసభ్యులు అందోళనకు గురయ్యారు. అంతా భయపడినట్టే నిన్న సీఎం కేసీఆర్ పరామర్శించిన తరువాత ఇవాళ వేకువ జామున ఆయన పరమపదించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more