(Image source from: Twitter.com/RaoKavitha)
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయ దుందుభి మోగించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన కౌంటింగ్ లో టీఆర్ఎస్కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు రాగా, చెల్లని ఓట్లు 10గా నమోదయ్యాయి. మొత్తం 823 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారీ ఆధిక్యంతో కవిత విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుభాష్రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేసి డిపాజిట్లను కూడా సాధించలేక బొల్తా పడ్డారు. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోనే అధిక సంఖ్యలో వున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఓట్లతో అమె విజయం లాంఛనమే అయినా.. బీజేపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అమె విజయాన్ని తుదివరకు ఉత్కంఠగా మార్చాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు. ఆమె గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అబద్ధపు మాటలు చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని... అయినా ఎవరూ వారిని నమ్మలేదని అన్నారు. విపక్షాల అబద్ధాలకు బదులుగా కవితకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. మరోసారి న్యాయం గెలిచిందని అన్నారు.
ఈ ఎన్నికలో గెలిచిన కల్వకుంట్ల కవిత ఈ నెల 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. తన సోదరి కవిత ఎమ్మెల్సీగా నెగ్గడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. మెనీ కంగ్రాచ్యులేషన్స్ కవితా అంటూ ట్వీట్ చేశారు. తిరుగులేని విజయం సాధించావంటూ చెల్లిని అభినందించారు. కవిత విజయానికి కృషి చేసిన నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణులను మెచ్చుకున్నారు. టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా విభాగాన్ని ఈ ఎన్నికల కోసం సమర్థవంతంగా నడిపించారంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఎంతో సమన్వయంతో పాటుపడ్డారని కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more