అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు అమెరికా డాలర్ క్రమంగా బలాన్ని పుంజుకోవడంతో బంగారం వెలవెలబోతోంది. డాలరపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో ఇటు బంగారంపై పెట్టిన పెట్టుబడుల అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి, ఇక దీనికి తోడు అటు స్టాక్ మార్కెట్లు కూడా కరోనా తరువాతి కాలంలో కాసింత నెమ్మెందిగా వేగాన్ని అందుకుంటున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులను లాభాల వైపు మళ్లిస్తున్నారని నిపుణులు వేస్తున్నారు, దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడ్డుతున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర గత కొంతకాలంగా రూ. 50 వేల దిగువన కోనసాగుతోంది. ఎంసీఎక్స్ లో డిసెంబర్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాముల బంగారానికి రూ. 510 పతనమై రూ. 50,060లకు చేరగా.. వెండి కూడా అదే బాటలో పయనించింది, వెండి ధర కిలోకు రూ.676 పడిపోయి రూ. 60,469 వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ ధరలు స్వల్పంగా పడిపోయాయి. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్సు బంగారం ధర 0.5 శాతం నష్టంతో 1,898 డాలర్లకు చేరగా, స్పాట్ మార్కెట్లో 0.4 శాతం మేరకు ధర తగ్గి 1,893 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా అదే దారిలో పయనించి 0.45 శాతం పడిపోయి 23.93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం కనుగోలుదారుగా అవతరించిన భారత్ దేశంలో లోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బంగారం ధరలు ఒక్కో విధంగా వున్నాయి, ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల పన్నులు, మేకింగ్ చార్జులలో వత్యాసం బంగారు ధరలపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో 24 కారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ.52,910గా నమోదు కాగా, 22 కారెట్ల పదిగ్రామాలు బంగారం ధర రూ.48,510గా నమోదైంది, ఇక సామాన్యుల ఆభరణం వెండి కూడా అదే బాటలలో రూ.61210గా నమోదైంది, ఇదే సమయంలో విశాఖపట్నంలోనూ బంగారం వెండి ధరలు హైదరాబాద్ తో సరిసమానంగా నమోదయ్యాయి. అయితే కేరళలో మాత్రం వీటి ధరల్లో వత్యాసం కనిపించింది, 24 కారెట్ల బంగారం ధర రూ. 50960గా, 22 కారెట్ల బంగారం ధర రూ.46719గా నమోదుకాగా, వెండి ధరలో మాత్రం మార్పు లేదు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more