ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ బాధిత దళిత యువతి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు పరామర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు బృంధం బూల్ గదికి బాధిత కుటుంబాన్ని కలిసి వారికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఘటన గురించి ఆతదనంతరం చోటుచేసుకున్న పరిణామాల గురించి బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. రాహుల్, ప్రియాంకలు రాక గురించి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుుల కూడా బూల్ గదికి చేరకున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ వెలుపలకు చేరుకున్నారు.
అయితే కార్యకర్తలను పోలీసులు గ్రామంలోని రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య గ్రామంలోని ప్రవేశించిన కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబానికి చేరుకున్నారు. హాత్రాస్ అత్యాచార బాధిత కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని రాహుల్ వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రియాంక గాంధీ పేర్కోన్నారు. పోలీసులతో గొడవ పడిన అనంతరం రాహుల్ గాంధీ బృందం బూల్ గదికి చేరకుంది. పోలీసులు ఇవాళ మరోమారు తమ కార్యకర్తలపై లాఠీచార్జీకి పాల్పడ్డారు. దీంతో తెగువ చూపిన ప్రియాంక గాంధీ తమ కార్యకర్తపై పోలీసు లాఠీ దెబ్బ పడకుండా అడ్డుగా వెళ్లారు.
ఉత్తర్ ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది. డీఎన్డీ ఫ్లైవేపై కొనసాగిన హైడ్రామాలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రాహుల్, ప్రియాంకా గాంధీలు గురువారం యమునా హైవేపై అడ్డుకున్న పోలీసులు రాహుల్ ను విఛక్షణా రహితంగా తోసివేయడంతో ఆయన కిందపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ కు బయలుదేరిన గాంధీ కుటుంబ సభ్యులను డీఎన్డీ వద్ద ఇవాళ మరోమారు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ ప్రతిఘటించారు. ఓ కార్యకర్తను లాఠీఛార్జీ నుంచి తప్పించేందుకు స్వయంగా తానే తోపులాటలోకి వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలతో పంచుకుంది, న్యాయం కోసం చేసే పోరాటంలో తాము ఎంతటి కష్ణాలనైనా ఎదుర్కొంటామని ట్వీట్ చేసింది. ఇక ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు దేశంలోని ఏ శక్తి తనను హాత్రాస్ బాధిత కుటుంబాన్ని కలవకుండా వారి అవేదనను వినకుండా అపలేదని ఢిల్లీ నుంచి హాత్రాస్ బయలు దేరి ముందు రాహుల్ గాంధీ అన్నారు. ఇక ఢిల్లీకి చేరకున్న తరువాత రాహుల్ గాంధీ.. భారత జాతి తన ఆడబిడ్డకు న్యాయం కావాలని అడుగుతొందని ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more