(Image source from: Zeenews.india.com)
దాదాపుగా 28 ఏళ్ల క్రితం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు ఎలా వుండబోతోందని దేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ్ల లక్నోలోని సీబిఐ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరిచింది. దీంతో ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఎట్టకేలకు తెరపడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కోంటున్న బీజేపి అగ్రనేతలకు ఇవాళ పెద్ద ఊరట లభించింది. ఈ కేసు తీర్పును ఇవాళ వెలువరించిన న్యాయస్థానం నిందులుగా అభియోగాలు ఎదుర్కోంటున్న ఎల్.కె.ఆద్వానీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతి, కల్యాణ్ సింగ్ సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది.
బాబ్రి మసీదు కూల్చివేతలో నిందితులందరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. బాబ్రి మసీదు కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్నవారిపై నేరాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. నిందితులపై సరైన ఆధారాలు, రుజువులు లేని కారణంగా వారిపై దాఖలైన అభియోగాలను న్యాయస్థానం కోట్టివేసింది. ఈ మేరకు లక్నోలోని సిబిఐ న్యాయస్థానం జస్టిస్ సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పును వెల్లడించారు. ఈ కేసు అభియోగాలు ఎదుర్కోంటున్న మొత్తం 49 మందిలో 17 మంది విచారణ కొనసాగుతున్న తరుణంలోనే మరణించారు. కాగా ఈ కేసులో మొత్తంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది.
తీర్పు నేపథ్యంలో నిందితులంతా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఈ నెల 16న న్యాయస్థానం అదేశించినా.. కరోనా కారణంగా బీజేపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, హాజరుకాలేదు. ఇక కల్యాణ్ సింగ్ లకు కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న కారణంగా వారు కూడా హాజరుకాలేదు. కాగా, సాక్షి మహారాజ్, వినయ్ కటియార్, ధరమ్ దాస్, పవన్ పాండే, వేదాంతి, లల్లూసింగ్, చంపత్రాయ్లతోపాటు మిగతావారంతా కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసు తీర్పు సందర్భంగా సీబీఐ కోర్టు బయట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్ తో పాటు పలు కీలక ప్రాంతాల్లోనూ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు బీజేపి అగ్రనేత ఎల్.కె.ఆద్వానీ పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని, నేడు మనందరికీ సంతోషకరమైన రోజుగా పేర్కోన్నారు. రామజన్మభూమి పట్ల తన వ్యక్తిగత, పార్టీ నిబద్ధతను తాజా తీర్పు నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తమను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆడ్వాణీ ఈ విధంగా స్పందించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును మురళీ మనోహర్ జోషి స్వాగతించారు. ఆలస్యమైనప్పటికీ కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. దీనిలో చివరకు న్యాయమే గెలిచిందన్నారు. మా ఉద్యమం సామాన్యులతో కూడినదని, దీనిలో ఎలాంటి కుట్ర లేదన్న విషయం తాజా తీర్పు ద్వారా నిరూపితమైందని ఆయన స్పష్టంచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more