Covid 19: 10418 fresh cases reported in AP ఏపీలో 24 గంటల్లో 10418 కేసులు.. 74 మరణాలు

Coronavirus in ap 10418 new covid 19 cases state tally pasts 5 27 lakh mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 5,27,094 Mark after 10418 new cases were reported in the last 24 hours, out of which 4,25,607 have so far recovered and have been discharged, while 4634 have died, the state health department said.

ఏపీలో కరోనా విజృంభన: 5 లక్షలు దాటి.. .. 24 గంటల్లో 10418 కేసులు.. 74 మరణాలు

Posted: 09/09/2020 11:43 PM IST
Coronavirus in ap 10418 new covid 19 cases state tally pasts 5 27 lakh mark

(Image source from: Socialnews.xyz)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా ఐదు లక్షల ఇరవై ఐదు వేల మార్కును అధిగమించింది. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఏడు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. వరుసగా గత పది రోజులుగా పది వేల మార్కుకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఐదు లక్షల ఇరవై అయిదు వేల మార్కును అధిగమించి ఐదున్నర లక్షల మార్కుకు చేరువలో వుంది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

తమిళనాడు కోయంబేడు మార్కట్ లో విజృంభించిన కరోనా ఏపీపై కూడా తన ప్రభావాన్ని చాటింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 10 వేలమార్కుకు మించిన స్థాయిలో కేసులు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఐదు లక్షల ఇరవై అయిదు వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 10418 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 5,27,512 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా వేయికి పైగా కేసులు తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనే నమోదు కావడం.. దీంతో పాటు చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, కడప, కర్నూలు జిల్లాల్లో రమారమి వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం రోజులుగా తగ్గుతున్న ఈ కేసులు మళ్లీ పెరగడంతో స్థానిక అధికార యంత్రాంగంతో పాటు జిల్లా వాసులను కూడా కలవరానికి గురిచేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 801, చిత్తూరు జిల్లాలో 887, తూర్పు గోదావరి జిల్లాలో 1399, గుంటూరు జిల్లాలో 707, కడప జిల్లాలో 785, కృష్ణా జిల్లాలో 350, కర్నూలు 484 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి,

నెల్లూరు జిల్లాలో 949, ప్రకాశం జిల్లాలో 1271, శ్రీకాకుళం జిల్లాలో 660, విశాఖపట్నం జిల్లాల్లో 414, విజయనగరంలో 577, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 1134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 74 మంది అసువులు బాసారు. కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి,

కడప జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, ప్రకాశం 7, విశాఖపట్నం 7, అనంతపురం 6, చిత్తూరు 6, గుంటూరు 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, కర్నూలు 5, శ్రీకాకుళం 5, విజయనగరం 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,634కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ ఇవాళ 9,842 మంది అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఈ సంఖ్య  4,25,607 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 97,271 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles