Two Maoists killed in exchange of fire with police in Bhadradri భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

Two maoists killed in exchange of fire with police in bhadradri

Punuguppa forest, cherla, Gundala, Bhadradri Kothagudem District, Maoists, Encounter, Fire Exchange, combing, DGP Mahender Reddy, Telangana, Crime

Two Maoist has been killed in an exchange of fire between Maoists and police here at Punuguppa forest area of Cherla mandal in Bhadradri-Kothagudem district.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

Posted: 09/07/2020 09:39 PM IST
Two maoists killed in exchange of fire with police in bhadradri

(Image source from: Millenniumpost.in)

తెలంగాణలో మరోమారు మావోల అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టు దళాలు ఎదరుపడటంతో ఇరు వర్గాలకు మధ్య ఎదరుకాల్పులు చెలరేగాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూనుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకా్లపుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఇటీవల గుండాల మండలంలోని దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో ఓ మావోయిస్టు మృతి చెందగా.. తాజాగా చర్ల మండలంలోని పూనుగుప్పలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి, ఇది జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు ఎదరు కాల్పులు జరిగాయి, ఈ నెలలో ఇదే జిల్లాలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి, గుండాలలో ఎదురుకాల్పుల జరిగి పక్షం రోజులు కూడా గడవక ముందే చర్లలో మరో ఎదురుకాల్పుల ఘటన జరగడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకుముందు మల్లెపల్లిటోగు అడవిలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ను గాయపర్చిన మావోయిస్టులు తప్పించుకున్న ఘటన నుంచి ఇక్కడ కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నాయి.

ఆగస్టు 6న బంద్‌ పేరుతో మావోయిస్టులు దాడులకు కుట్ర పన్నారని కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్‌ తెలిపారు. భద్రతా బలగాలు, ప్రజాప్రతినిధులపై దాడులకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో చర్ల అటవీ ప్రాంతంలో బలగాలను అప్రమత్తం చేసి మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం పూసుగుప్పలో పోలీసులు-మావోయిస్టుల మధ్య 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ ధ్రువీకరించారు. ఘటనాస్థలంలో ఎస్బీబీఎల్‌ తుపాకీ, పిస్టల్‌, రెండు కిట్‌ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో తనిఖీలు కొనసాగుతున్నాయని ఎస్పీ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles