యూఏఈలోని భారతీయుడిని అదృష్టం వరించింది. ఏడారి దీవులను నమ్ముకుని ఎందరెందరో భారతీయులు అక్కడికి వెళ్లి తమ ఉపాధిని వెతుక్కుంటారు. అయితే కొందరికి కష్టాలను మిగిల్చిన అవే దీవులు మరికోందరికి మాత్రం అదృష్టవంతులుగా చేస్తున్నాయి. అయితే ఇలా కూడా అదృష్టవంతులు కావచ్చునన్న విషయం కూడా తెలియని ఏడారి దీవుల బాటసారులెందరో వున్నారు. కాగా, అదృష్టవంతుల్ని చేసినా కోట్ల మేర చేసిందే కానీ తక్కువ కాదు. అదేంటీ అంటే అదే అక్కడి బిగ్ టిక్కెల్ రఫ్టేల్ లాటరీ. ఈ టిక్కెట్ లో కోట్లాది రూపాయలు గెలుచుకున్నవారిలో ఎందరో భారతీయులు వున్నారు.
కాగా తాజాగా విడుదల చేసిన లక్కీ లాటరీలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ (35) గెలుచుకున్నాడు. షార్జాలోని ఓ ఐటీ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ కు భార్య, ఇద్దరు సంతానం, లాటరీ నిర్వాహకులు డ్రా తీసిన వెంటనే అతని పేరు రావడంతో టిక్కెట్ పై వున్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి గురుప్రీత్ సింగ్ తో మాట్లాడారు. దీంతో ఆయనకు నోట మాటరాలేదని, తనకు ఏకంగా ఇరవై కోట్ల లాటరీ తగిలిందంటే నమ్మలేకపోయానని అన్నాడు. అయితే తనకు లాటరీ తగులుతుందని గానీ, తగిలితే ఏం చేయాలని గానీ ఎప్పుడూ అలోచించలేదని, దీంతో వచ్చిన డబ్బును కూడా ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకోలేదని, అయితే అందులో సింహభాగం మాత్రం సేవింగ్స్ చేస్తామని చెప్పాడు.
తాను ఐదేళ్ల వయస్సులో వుండగా తన తల్లిదండ్రులతో కలసి ఈ దేశానికి వచ్చానని, అయితే అప్పట్నించి ఈ దేశం తనకు అన్ని ఇచ్చిందని.. తాజాగా తన గతిని మార్చేలా ఒక్కసారిగా కోట్ల రూపాయల ధనాన్ని కూడా ఇచ్చిందని అన్నాడు గురుప్రీత్. తాను గత రెండేళ్లుగా బిగ్ టికెట్ లాటరీ కొనుగోలు చేస్తున్నానని, అయితే ఎట్టకేలకు అదృష్టం వరించిందని అన్నారు. ఈ నెల 3న ప్రకటించిన లాటరీ ఫలితాల్లో గురుప్రీత్ జాక్పాట్ కొట్టాడు. ఏకంగా 10 మిలియన్ దిర్హామ్స్ (దాదాపు రూ. 19.90 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ మేరకు ‘ఖలీజ్ టైమ్స్’ తెలిపింది. అంత పెద్ద మొత్తం తగలడంతో గురుప్రీత్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more