జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలో అక్రమంగా చోచ్చుకువచ్చిన ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ జిల్లాలో కార్డన్ సర్చ్ నిర్వహించాయి. అనంతరం జిల్లాలోని కిల్లోరా ప్రాంతంలోనే వారు తలదాచుకన్నారన్నసమాచారం మేరకు భద్రతా దళాలు ఇవాళ గాలింపు చర్యలు చేపట్టాయి. కిల్లోరా ప్రాంతంలో అనువణువూ భారత భద్రతా దళాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో తాము వారికి పట్టుబడతామని భావించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు జరిపాయి. ఇరువైపులా కాల్పులు జరగడంతో కిల్లోరా ప్రాంతంలో స్థానికులు భయకంపితులయ్యారు. కాగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక మరో ఉగ్రవాది భారత బలగాలకు లొంగిపోయ్యాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అతని వద్ద నుంచి రెండు ఏకే ఆయుధాలతో పాటు మూడు పిస్టలను బధ్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు, కాగా, స్థానికంగా ఇంకా భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోందని అర్మీవర్గాలు వెల్లడించాయి.
షోపియాన్ జిల్లాలోని కిల్లోరా ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కివున్నారా.? అన్న కోణంలో ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి, కాగా మరణించిన నలుగురు ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే వివరాలు తెలియరాలేదని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. “షోపియన్ ఎన్ కౌంటర్ అప్డేట్: 02 గుర్తు తెలియని ఉగ్రవాదులు చంపబడ్డారు. ఆపరేషన్ జరుగుతోంది. మరిన్ని వివరాలు వెలువడుతున్నాయి “ అంటూ ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలోనే జమ్మాకాశ్మీర్ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా మీడియాతో పాటు ప్రజలకు సమాచారం అందించారు.
షాపియన్ ఎన్ కౌంటర్లో మరణించిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరిని పోలీసుల బలగాలు గుర్తించాయి, వారిలో ఒకరు అల్ బదర్ గ్రూప్ జిల్లా కమాండర్ షకూర్ పరే అని తెలిపాయి. ఇక మరో హతమైన ఉగ్రవాదిని సుహైల్ భట్ అని పోలీసులు గుర్తించారు. ఇక ఇటీవలే శ్రీనగర్ లోని ఖాన్మో ప్రాంతం నుంచి గ్రామ అధికారి అయిన పంచ్ ను కిడ్నాప్ చేసిన హతమార్చిన సుహెల్ భట్ ఇవాళ ఎన్ కౌంటర్లో మట్టుబెట్టినట్లు పోలీసులు జమ్మూకాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు, దీంతో పంచ్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని.. ఇక ముందు కూడా ఇదే పంథాను కొనసాగిస్తామని ఉగ్రవాదులకు భద్రతాబలగాలు పంపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more