4 terrorists killed in encounter in Shopian ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం..

Four terrorists killed in encounter in jammu and kashmirs shopian

encounter, J-K encounter, Jammu And Kashmir encounter, Shopian encounter, Killora encounter, terrorists killed in encounter, pak terrorists encounter, jammu encounter, jammu kashmir encounter, J-K, Jammu And Kashmir, Shopian, Killora, terrorists, Indian forces, Crime

The Jammu and Kashmir Police confirmed that four unidentified terrorists have been killed in an ongoing encounter with security forces in the Killora area of Shopian district in South Kashmir. The police also said that one terrorist had surrendered and two AKs and three pistols were recovered by security personnel.

జమ్మూలో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు..

Posted: 08/29/2020 12:54 AM IST
Four terrorists killed in encounter in jammu and kashmirs shopian

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలో అక్రమంగా చోచ్చుకువచ్చిన ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ జిల్లాలో కార్డన్ సర్చ్ నిర్వహించాయి. అనంతరం జిల్లాలోని కిల్లోరా ప్రాంతంలోనే వారు తలదాచుకన్నారన్నసమాచారం మేరకు భద్రతా దళాలు ఇవాళ గాలింపు చర్యలు చేపట్టాయి. కిల్లోరా ప్రాంతంలో అనువణువూ భారత భద్రతా దళాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో తాము వారికి పట్టుబడతామని భావించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు జరిపాయి. ఇరువైపులా కాల్పులు జరగడంతో కిల్లోరా ప్రాంతంలో స్థానికులు భయకంపితులయ్యారు. కాగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక మరో ఉగ్రవాది భారత బలగాలకు లొంగిపోయ్యాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అతని వద్ద నుంచి రెండు ఏకే ఆయుధాలతో పాటు మూడు పిస్టలను బధ్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు, కాగా, స్థానికంగా ఇంకా భద్రతా బలగాల ఆపరేషన్‌ కొనసాగుతోందని అర్మీవర్గాలు వెల్లడించాయి.

షోపియాన్ జిల్లాలోని కిల్లోరా ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కివున్నారా.? అన్న కోణంలో ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి, కాగా మరణించిన నలుగురు ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే వివరాలు తెలియరాలేదని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. “షోపియన్ ఎన్ కౌంటర్ అప్‌డేట్: 02 గుర్తు తెలియని ఉగ్రవాదులు చంపబడ్డారు. ఆపరేషన్ జరుగుతోంది. మరిన్ని వివరాలు వెలువడుతున్నాయి “ అంటూ ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలోనే జమ్మాకాశ్మీర్ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా మీడియాతో పాటు ప్రజలకు సమాచారం అందించారు. 

షాపియన్ ఎన్ కౌంటర్లో మరణించిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరిని పోలీసుల బలగాలు గుర్తించాయి, వారిలో ఒకరు అల్ బదర్ గ్రూప్ జిల్లా కమాండర్ షకూర్ పరే అని తెలిపాయి. ఇక మరో హతమైన ఉగ్రవాదిని సుహైల్ భట్ అని పోలీసులు గుర్తించారు. ఇక ఇటీవలే శ్రీనగర్ లోని ఖాన్మో ప్రాంతం నుంచి గ్రామ అధికారి అయిన పంచ్ ను కిడ్నాప్ చేసిన హతమార్చిన సుహెల్ భట్ ఇవాళ ఎన్ కౌంటర్లో మట్టుబెట్టినట్లు పోలీసులు జమ్మూకాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు, దీంతో పంచ్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని.. ఇక ముందు కూడా ఇదే పంథాను కొనసాగిస్తామని ఉగ్రవాదులకు భద్రతాబలగాలు పంపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : encounter  J-K  Shopian  Killora  terrorists  pak terrorists encounter  Indian forces  Jammu And Kashmir  Crime  

Other Articles