(Image source from: Ndtv.com)
దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావని.. దీంతో సమస్యలు మరింత జఠిలం అవుతాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు, అందుకోసం దేశంలోని మీడియాను ఉపయోగించుకోవడం వల్ల పేదలకు ఒరిగేది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. దేశంలో కొవిడ్-19 మహమ్మారి 33 లక్షల మందికి పైగా వ్యాప్తించినా.. ప్రభుత్వం ఇప్పటికీ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సమగ్ర వ్యాక్సిన్ విధానాన్ని రూపొందించి, అనుసరించాల్సి ఉండగా... ఆ దిశగా చర్యలు కనుచూపు మేరలో కనపడటం లేదని విమర్శించారు.
‘‘కొవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పాటికే సక్రమమైన, అందరినీ కలుపుకునే విధంగా వ్యూహాన్ని అనుసరించి ఉండాలి. కానీ, ఇప్పటికీ ఆ సూచనలు లేవు. భారత ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం ఆందోళనకరం’’ అని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ధ్వజమెత్తారు. భారత్ కొవిడ్ వ్యాక్సిన్ను ఉత్తత్తి చేసే సామర్థ్యమున్న దేశమని రాహుల్ గతంలో ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగానే ఉంటుందని ఆర్బీఐ తాజాగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా ఇదే విషయంపై తాను హెచ్చరిస్తున్నానని.. తన వ్యాఖ్యలను ఇప్పుడు ఆర్బీఐ నిర్ధారించిందని చెప్పారు.
కాగా, వ్యాక్సిన్ను అందుబాటు తెచ్చేందుకు, సక్రమంగా పంపిణీ చేసేందుకు.. స్పష్టమైన, సమదృష్టిగల వ్యూహాన్ని రూపొందించి, అనుసరించాలన్నారు. మీడియాలో ప్రకటనలు పేదలకు మేలు చేయవని ఆయన విమర్శించారు. ఆర్థికి పరిస్థితిని మెరుగుపరచాలంటే... ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఎక్కువ అప్పులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పేదలకు డబ్బు ఇవ్వాలని, పారిశ్రామికవేత్తలకు ఎక్కువ పన్నులు విధించరాదని సూచించారు. వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పారు. మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోవని అన్నారు.
A fair and inclusive Covid vaccine access strategy should have been in place by now.
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2020
But there are still no signs of it.
GOI’s unpreparedness is alarming. https://t.co/AUjumgGjGC
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more