రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది, అసమ్మతి జెండా ఎగురవేసిన మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గానికి అటు సుప్రీంకోర్టులో ఊరట లభించగా, ఇటు రాజస్థాన్ కోర్టు కూడా ఆయన ఎమ్మెల్యేల వేటుపై స్టేటస్ కో విధించినంది. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వర్గీయులు అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ వద్ద నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో కూడా తెలియని ఉత్కంఠ నెలకోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు యువనేత సచిన్ పైలట్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పుకునే నేత.. తిరుగుబాటు బావుటా ఎందుకు ఎగురవేశారని, నిజంగా పార్టీలో ఆయన సమస్యలను ఎదుర్కోని వుండివుంటే అది పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అధిష్టానం దృష్టికి తీసుకురావాలని కానీ ఇలా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి బీజేపి పాలిత రాష్ట్రాల్లో తలదాచుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీలో చేరనంటూనే హర్యానాలో ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. ఇక పనిలో పనిగా కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తలపై కూడా సిబల్ పైలట్ ను ప్రశ్నించారు.
కొత్త పార్టీ ఏమైనా పెట్టే ఉద్దేశం ఉంటే అదేదో చెప్పాలని అడిగిన సిబల్.. సచిన్ పైలట్ తాను ఎదుర్కోంటున్న ఇబ్బందులను అధిష్టానంతో చెప్పుకోలేని నాయకుడు.. తనను నమ్ముకున్నవారికి ఎక్కడకు తీసుకువెళ్తున్నాన్నని కూడా స్పష్టంగా చెప్పలేని ఆగమ్యచోర పరిస్థితల్లోకి జారుకుంటున్నాడని అన్నాడు. తన భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవడం ఆయన వ్యక్తిగతం కానీ ఏకంగా 20 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని ఎందుకు ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ప్రశ్నించారు. 20-25 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయిపోవాలనే కోరికను కట్టిపెట్టి తమాషాలు ఆపాలని హెచ్చరించారు. సీఎం కావాలనుకుంటే చెప్పాలని, ఎందుకీ నిరసన అని పైలట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీలో చేరడం లేదని ప్రకటించి చెబుతున్న పైలట్.. మరి కాంగ్రెస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని, ఒకవేళ కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉంటే ఆ విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హోటళ్లలో కూర్చుని మాట్లాడడం కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని సిబల్ సవాలు విసిరారు. మరోవైపు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాపైనా సిబల్ మండిపడ్డారు. గవర్నర్ తన రాజ్యాంగ విధులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లు రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధులుగా ఉండడం మానేసి కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటూ ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెబుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more