ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరోమారు అసంతృప్తులు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు వైసీపి పార్టీని నమ్మితే గొర్రె కసాయివాడిని నమ్మినట్టేనని వ్యాఖ్యలు చేసి.. తన అసంతృప్తిని వ్యక్తం చేసిన క్రమంలోనే విజయవాడలో వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన మహిళా నేత ఏకంగా మీడియా ముఖ్యంగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు అమె మీడియా సమావేశస్థలికి చేరుకుని అమెను ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు అధికార పక్షాన్ని అందుకోవడం కోసం.. పగ్గాలను చేపట్టడం కోసం రాజకీయ నేతలు, పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా హామీలను గుప్పించడం సర్వసాధారణమే.
అనితర సాథ్యమయ్యే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం నిత్యం జరిగే విషయమే అయినా.. నాయకులకు మాత్రం ఆశల వలయంలో బంధించి.. ఆ తరువాత ముఖం కూడా చూడకపోవడంతో పలు సందర్భాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి. అదే తరహాలో విజయవాడ మాల మహానాడు అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. తన సమస్యలు పరిష్కరించాలని సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ మధ్యలోనే ఆమె విషం తాగేశారు. ఒకట్రెండు సార్లు ఆమె విషం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారని జోని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం లేదని.. ఈ విషయంపై పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకు అసలు స్పందించలేదన్నారు. వైస్సార్సీపీ పార్టీని సొంత కుటుంబంలా భావిస్తే పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనని మోసం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 6న వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని కలిశానని.. అయినా తనకు న్యాయం జరగలేదన్నారు జోని కుమారి. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more