HC dismisses petition challenging demolition of old Secretariat పాత సచివాలయం కూల్చివేతకు లైన్ క్లియర్..

High court dismisses plea questioning demolition of old telangana secretariat

telangana secretariat, secretariat hyderabad, secretariat telangana, hyderabad secretariat, telangana new secretariat, new secretariat telangana, outer ring road hyderabad, new secretariat, Telangana Secretariat new building, Secretariat new building design, Telangana Secretariat, TS new Secretariat building, Telangana new Secretariat building design

The government succeeded in its second round of litigation on the issue of construction of the new Secretariat building. The panel of Chief Justice Raghuvendra Singh Chauhan and Justice Vijay Sen Reddy dismissed the plea of Prof PL Vishweshwar Rao who challenged the earlier decision to demolish and later the act of demolition.

పాత సచివాలయం కూల్చివేతకు లైన్ క్లియర్.. తొలగిన బాలారిష్టాలు

Posted: 07/17/2020 08:53 PM IST
High court dismisses plea questioning demolition of old telangana secretariat

తెలంగాణకు కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 17న శంఖుస్థాపన చేసిన నాటి నుంచి ఏర్పడుతున్న అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన తరుణంలోనూ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో కూల్చివేతలను నిలిపివేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ పిల్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాత సచివాలయ కూల్చివేతల పనులకు అనుమతులను మంజూరు చేసింది. దీంతో గత పది రోజులుగా సచివాలయం కూల్చివేతల పనులపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

సెక్రటేరియెట్ కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుదాకర్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు, సుధాకర్ ల పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా, సచివాలయం కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతి తీసుకోలేదని గతంలో విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

అయితే కూల్చివేత సమయంలో పర్యావరణ అనుమతి అవసరం లేదని రాష్ట్రప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు, అయితే కూల్చివేతలకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నామని తెలిపారు. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేతలు.. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర పర్యవరణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. తాజాగా కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పడంతో పిటిషన్ ను రద్దు చేస్తూ.. సచివాలయ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు మార్గం సుగమం చేసింది.

సుప్రీం కోర్టులోనూ సర్కారుకు ఊరట

 

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్‌ 29న అనుమతిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. సచివాలయం కూల్చివేతకు సంబంధించి తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles