HC extends stay till friday on demolition of old Secretariat పాత సచివాలయం కూల్చివేతపై స్టే పొడగింపు: హైకోర్టు

High court extends stay for one more day on demolition of old telangana secretariat

telangana secretariat, secretariat hyderabad, secretariat telangana, hyderabad secretariat, telangana new secretariat, new secretariat telangana, outer ring road hyderabad, new secretariat, Telangana Secretariat new building, Secretariat new building design, Telangana Secretariat, TS new Secretariat building, Telangana new Secretariat building design

High Court Extends stays again for one more day up till friday i.e. 16 July 2020 on demolition of old Telangana Secretariat complex, hearing the Public Interest Litigation petition, which was filed two days ago, against the demolition work of old secretariat building complex.

పాత సచివాలయం కూల్చివేతపై స్టే పొడగింపు: హైకోర్టు

Posted: 07/16/2020 04:53 PM IST
High court extends stay for one more day on demolition of old telangana secretariat

తెలంగాణకు కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 17న శంఖుస్థాపన చేసిన నాటి నుంచి అడ్డంకులు ఏర్పడుతునే వున్నాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్న ఈ తరుణంలో హైకోర్టు కూల్చివేతలను నిలిపివేయాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ కూడా విచారణకు వచ్చిన ఈ పిల్ నేపథ్యంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం మరోమారు కూల్చివేత పనులపై రేపటి (శుక్రవారం) వరకు స్టే విధించింది. సోమవారం రోజున ఈ విషయంలో స్టే విధించిన న్యాయస్థానం.. దానిని మరో రెండు రోజుల పాటు బుధవారం వరకు పోడిగింది, నిన్న విచారణ నేపథ్యంలో స్టే విధించగా, ఇవాళ మరోమారు స్టే విధించింది.

సెక్రటేరియెట్ కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ సామాజిక, పర్యావరణ కార్యకర్త పి.ఎల్‌.విశ్వేశ్వరరావు పిల్ చేసిన విషయం తెలిసిందే. నిన్న విశ్వేశ్వరరావు తరపు న్యాయవాది న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ కూల్చివేతలకు ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని తెలిపారు. అయితే పర్యావరణ అనుమతులు నిర్మాణాలు మాత్రమే అవసరమని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిర్మాణాలు చేపట్టే క్రమంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని చెప్పారు. దీంతో న్యాయస్థానం సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సంబంధించి గురువారం పీసీబీ, రాష్ట్రస్థాయి పర్యావరణ మదింపు అథారిటీ నివేదికలు సమర్పించారు.

ఐతే ఆ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సూటిగా సమాధానం చెప్పకుండా తెలివిగా నివేదికలు ఇచ్చారని వ్యాఖ్యానించింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమంటే ఏంటి? పాత భవనాలు కూల్చడమంటే కొత్త నిర్మాణానికి సిద్ధం చేయడమే కదా? అని ప్రశ్నించింది. కూల్చివేతలకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా? చెప్పాలని నిలదీసింది. ఐతే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తమకు సమాచారం రాలేదన్న అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్.. సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం స్పందన కీలకమని అభిప్రాయపడిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles