Covid 19: 1322 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 1322 కేసులు.. 8 మరణాలు

Coronavirus in ap 1322 new covid 19 cases state tally crosses 20 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 20000 Mark after 1322 new cases were reported in the last 24 hours, out of which 8920 have so far recovered and have been discharged, while 239 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. ఒక్క రోజులో 1322 కేసులు.. 7 మరణాలు

Posted: 07/06/2020 11:06 PM IST
Coronavirus in ap 1322 new covid 19 cases state tally crosses 20 thousand mark

(Image source from: Deccanchronicle.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు పదిహేడు వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ఏడు వందల మార్కుకు పైగానే సాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా పద్దెనిమిది వేల మార్కుకు చేరువలో చేరడం అందోళనకరం, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ ఐదు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఇరవై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 1322 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పద్దెనిమిది వేల మార్కుకు చేరువలో వుంది. రాష్ట్రంలో మొత్తంగా 20,019 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ముగ్గురిగా నమోదుకాగా, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 56 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 59గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 1263 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఆనంతపురంలో 142, చిత్తూరు జిల్లాలో 120, తూర్పు గోదావరి జిల్లాలో 171, గుంటూరు జిల్లాలో 197, కడప జిల్లాలో 96, కృష్ణా జిల్లాలో 55, కర్నూలు 136. నెల్లూరు జిల్లాలో 41, ప్రకాశం జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 36, విశాఖపట్నం జిల్లాల్లో 101, విజయనగరంలో 24 కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఏడుగురు అసువులు బాసారు. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఏడు మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 239 చేరింది. కాగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల నుంచి ఇవాళ 424 మంది కోవిడ్  వైరస్ నుంచి కోలుకున్నారు. వీరిని గడిచిన 24 గంటల్లో కరోనాబారిన పడి కోలుకున్న పేషంట్లను వైద్యాధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8920కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 10,860కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 419గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2235కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles