ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేత, వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తాను విక్రయించిన విల్లా అధునీకరణ విషయంలో కొనుగోలుదారుల ఇంటిలోకి చోరబడి వారిని భయభ్రాంతులకు గురిచేసి.. దౌర్జన్యం చేసిన కేసులో పీవీపిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీపీ నుంచి విల్లాను ఖరీదు చేసిన పోరుగింటివారు ఆయనపై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తనను అరెస్టు చేయకుండా పివీపీ రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయనను అరెస్టు చేయవద్దని అదేశాలను జారీ చేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఆనయను అరెస్టు చేయకుడదని న్యాయస్థానం తమ ఉత్తర్వులలో పేర్కోంది. దీంతో పోరుగింటి వారిపై దౌర్జన్యం సహా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులలో ఆయన తాత్కాలిక ఊరట లభించింది.
తన ఇంటి పొరుగున విల్లాలో నివాసముంటున్న యజమానిపై దౌర్జన్యం చేసి వారి ఇంట్లోకి తన మనుషులతో కలిసి హల్చల్ చేసిన కేసులో పోలీసులు ఆయనపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన క్రమంలో తొలిరోజు విచారణకు హాజరైన పీవీపీ రెండో రోజు డుమ్మాకోట్టాడు. దీంతో ఆయనను విచారించేందుకు ఆయన నివాసానికి వెళ్లగా వారిని లోనికి ప్రవేశించకుండా ఆయన తన పెంపుడు కుక్కలను పోలీసులపైకి ఉసిగొల్పాడు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కల్గించడంతో పీవీపీపై పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారు.
పోలీసుల అధికారుల విచారణను అడ్డుకునేందుకు, వారిపై దాడి, లేదా విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించనందుకు గాను ఆయనపై పోలీసులు 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని కోరడంతో న్యాయస్థానం పీవీపీ బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈకేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more