Diesel now costlier than petrol in Delhi for first time వరుసగా పదిహేడవ రోజు బాదేసిన ఇం'ధన' సంస్థలు..

Petrol diesel prices revised further two fuels now cost almost same in delhi

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

Petrol price on Tuesday was hiked by 20 paise per litre and diesel by 55 paise as the oil companies increased prices for the 17th day in a row that took the cumulative increase to a steep Rs 8.5 and Rs 10.01 per litre, respectively. Petrol price in Delhi was hiked to Rs 79.76 per litre from Rs 79.56, while diesel rates were increased to Rs 79.40 a litre from Rs 78.55.

దేశరాజధానిలో తొలిసారి: పెట్రోలు ధరను అధిగమించిన డీజిల్ ధర..

Posted: 06/24/2020 04:00 PM IST
Petrol diesel prices revised further two fuels now cost almost same in delhi

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పేరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు కూడా క్రమంగా పెరుగుతూ.. ఏకంగా రెండేళ్ల గరిష్టస్థాయిని కూడా అందుకుని మరింతపైకి ఎగబాకుతున్నాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ధరలు కలుపుకుని ఏకంగా 64శాతం మేర పొందుతున్నాయని, ఇక వాహనదారుడికి మాత్రం అంతర్జాతీయ మార్కట్ ధరల లభ్దిని చేకూర్చకుండా.. వాయింపులను మాత్రం మోయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. సంస్థలు ధరల పెంపుపై వెనక్కు తగ్గడం లేదు. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 100 ప్లస్ డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఇదే క్రమంలో వరుసగా పదిహేడు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

గత పద్దెనిమిది రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్ ధర ఏకంగా డీజిల్ ధరతో సమానంగా ఎగసింది. మరో విధంగా చెప్పాలంటే పెట్రోల్ ధరను కూడా మించిపోయింది. దేశరాజధానితో పాటు పలు నగరాల్లో ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంధన ధరల్లో వున్న వత్యాసం పోయి.. డీజిల్ ధరకు రెక్కలు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీలో ఇలాంటి పరిణామం చోటుచేసుకువడం ఇదే తొలిసారి. కాగా దేశంలో అన్ లాక్ 1.0ను జూన్ 7 నుంచి అమల్లోకి రాగా, అదే రోజు నుంచి వరుసగా పద్దెనిమిది రోజులుగా ఇంధన ధరలు కూడా మారుతూవస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఈ పద్దెనిమిది రోజులో క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వాహనదారులకు ఆ లబ్దిని కల్పించని ఇంధన సంస్థలు.. వరుసగా పద్దెనిమిది రోజులుగా ధరలను పెంచుతూనే వున్నాయి.

కాగా గత పద్దెనిమిది రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు ఇవాళ కేవలం పెట్రోల్ దరపై ఎలాంటి మార్పులు లేకపోగా డీజిల్ ధరపై మాత్రం 48 పైసల మేర పెంపును విధించింది. డీజిల్ ధర పెంపుతో నిత్యావసర సరుకులతో పాటు ప్రజారవాణ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపి తద్వారా వాటి చార్జీలు పెరుగుతున్నా.. కేంద్రంతో పాటు ఇంధన సంస్థలు మాత్రం డీజీల్ ధరలకు రెక్కలు తొడిగే ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ పై తొమ్మిది రూపాయల నలబై ఒక్క పైసలు మేర రూపాయలు ధర పెరగ్గా, డీజిల్ పై పదిన్నర రూపాయల మేర దర పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. 

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ.79.76 పైసలు మరియు డీజిల్ ధర రూ. 79.88 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.86.54కి, డీజిల్‌ 78.22 పైసలకు, కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.81.45, డీజిల్ ధర రూ. 75.06కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 83.04 డీజిల్ రూ. 77.17కు పెరుగగా, హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధరలో ఎలాంటి పెంపు లేకపోవడంతో నిన్నటి ధర రూ.82.79కు, డీజిల్ ధర 50 పైసలు పెరుగుదలతో రూ.78.10కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.83.15కు చేరింది. డీజిల్‌ ధర కూడా 50 పైసలు పెరుగుదలతో రూ.78.26కు ఎగసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles