కరోనా మహమ్మారి దెబ్బకు మానవ జీవితం అస్తవ్యస్తమైంది. అలాయ్ భలాయ్ అనే రోజులు కాస్తా.. అమడ దూరం వుండి మాట్లాడండీ అనే పరిస్థికి వచ్చింది. ఎక్కడికీ వెళ్లలేని.. ఏ వేడుకా చేసుకోలేని పరిస్థితులు దాపురించాయి. ఇంట్లో చిన్నారుల పుట్టిన రోజుకు కూడా బంధువుల సంగతి పక్కనబెట్టినా.. కనీసం తాతా, పెదనాన్న, చిన్నాన్న, అత్తయ్య ఇలా ఎవరూ హాజరులేకుండా.. అందుబాటులోకి వచ్చిన వీడియో కాలింగ్ లో చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే తప్ప.. వచ్చి నోట్లో కేక్ పెట్టి తినిపంచి అప్యాయతను పంచే పరస్థితులు కనుమరుగయ్యాయి.
ఇక పెళ్లిళ్లలో కూడా కేవలం ముఖ్యమైన బంధజనం తప్ప పెద్ద సంఖ్యలో బంధుగణాన్ని అహ్వానించే రోజులు పోయాయి. కరోనా తన ఉద్దృతి అంతకంతకూ పెంచుకుంటూ విలయతాండవం చేస్తుండటంతో ఎంత కావాల్సిన వారైనా దూరంగా వుంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చావులకు కూడా 20 మందికి మించి అధికారులు అనుమతించడం లేదు. ఎంత ప్రజాభిమానం వున్నా, బంధుజనం వున్నా.. ఇంట్లో కూర్చోనే కన్నీళ్లను వదలాల్సిందే తప్ప. మరుభూమికి వెళ్లలేని దుస్థితి వచ్చింది. ఇక ఇదే తరహాలో తెలంగాణ ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే గ్రామదేవతల బోనాల ఉత్సవాలు కూడా ఈ సారి కళతప్పుతోంది.
ప్రతీ ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలు కూడా భక్తులు లేక, డప్పు చప్పుళ్లు లేక, పోతరాజులు, ఘటాల ఊరేగింపులు, పలహారం బండ్లు లేకుండా సాదాసీదాగా జరగనున్నాయి. ఈ సారి బోనాల పండుగకు పూజారులే బోనాలు ఎత్తనున్నారు. ప్రభుత్వమే అన్ని ఆలయాల్లో పట్టువస్త్రాలను సమర్పించనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ఇళ్లలో ఉండే జరుపుకున్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే ఆషాడ బోనాలకు కూడా భక్తులను అనుమతించడం లేదు. బోనాలను కూడా భక్తులు ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. ఈ మేరకు బోనాల వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది.
హైదరాబాద్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 73శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. బోనాలు, ఘటాల ఊరేగింపు వంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారని.. అలా జరిగితే కరోనా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని జంట నగరాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
* ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
* గోల్కొండ బోనాల వేడుకల్లో 10 మంది మాత్రమే పాల్గొంటారు.
* అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుంది.
* ఈసారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు.
* గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదు.
* ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలి
* ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more