ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా.. ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసుకొని రథయాత్రను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. పలు ఆంక్షల నడుమ రథయాత్ర జరపాలన్న సుప్రీంకోర్టు... ఒకవేళ పరిస్థితి చేదాటిపోతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, యాత్రను నిలిపివేయవచ్చని సూచించింది. ఇక రథయాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రథయాత్రపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమీక్ష నిర్వహించారు.
పూరీలో జూన్ 23 నుంచి రథయాత్ర జరగనుంది. ప్రతి ఏటా 10-12 రోజుల పాటు జగన్నాథుడి రథయాత్రను కన్నుల పండవగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొని పులకించిపోతారు. కానీ ఈసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని కొందరు పిల్ వేశారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు రథయాత్రను నిర్వహించకూడదని జూన్ 18న స్పష్టం చేసింది. ప్రజలకు ఏమైనా జరిగితే ఆ దేవుడు మనల్ని క్షమించడని తెలిపింది. ఐతే ఈ తీర్పును పున: పరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. సోమవారం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన షరతులకు లోబడే రధయాత్రను నిర్వహించాలని తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటు రాష్ట్ర అధికారులతో పాటు అటు ఆలయ సభ్యులతోనూ సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన అధికారులతో పాటు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించింది. నకాగా, ఒడిశా వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలో 304 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చనిపోయారు. ఒడిశాలో ఇప్పటి వరకు 5,160 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3,534 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14 మంది మరణించారు. ప్రస్తుతం ఒడిశాలో 1,607 యాక్టివ్ కేసులున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more