Petrol price hiked by 52 paise per litre, diesel by 60 paise వరుసగా పద్నాల్గవ రోజు బాదేసిన ఇం‘ధర’ సంస్థలు..

In 14 days petrol diesel rates hiked by more than rs 7 per litre

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

Petrol and Diesel prices have continued to hike for the last fifteen days. On Saturday, the prices have further gone high. The prices have been started increasing after State-owned oil marketing companies started revising the petrol and diesel prices on daily basis. petrol was increased by 52 paise per litre and diesel by 60 paise per litre in Hyderabad taking the prices to Rs. 81.88 and Rs. 75.91.

హైదరాబాద్ లో రూ.82కు చేరువలో పెట్రోల్, రూ.76కు చేరిన డీజిల్ ధర

Posted: 06/20/2020 04:28 PM IST
In 14 days petrol diesel rates hiked by more than rs 7 per litre

(Image source from: Newindianexpress.com)

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పెరుగడంతో ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ టో గత నెలలో వున్న ఇరవై డాలర్ల బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర రెట్టింపు ధర కన్నా అధికస్థాయికి చేరడంతో ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు ఏడాది గరిష్టస్థాయిని దాటి పరుగులు పెడుతున్నాయి. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 140 డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఇదే క్రమంలో వరుసగా పదమూడవ రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో ఏకంగా ఏడాది గరిష్టస్థాయికి ఇంధన ధరలు చేరుకున్నాయి. గత పదమూడు రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్ ధర ఏకంగా ఏడు రూపాయలకు చేరువలో పెరగ్గా, డీజిల్ పై ఎనమిది రూపాయల మేర పెరిగింది.

ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర హైదారాబాదులో ఏకంగా రూ.80 దాటగా, అమరావతిలో ఏకంగా రూ.81కి చేరింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్రప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత సేవలు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. ఇటు పెట్రోల్ తో పాటు ఆటు డీజీల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు కూడా పెరుగుతున్నాయి.

దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, గత పద్నాలుగు రోజూలుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా పద్నాల్గవ రోజూ ధరలు పెరిగాయి. తాజాగా ఇవాళ శనివారం నాడు లీటరు పెట్రోలుపై 52 పైసలు, లీటరు డీజిల్ పై 60 పైసల ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో గత పద్నాలుగు రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ. 7.63 మేర.. డీజిల్ పై రూ. 8.36 మేర పెరిగినట్లయింది.

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ.78.88కి, డీజిల్ ధర రూ.77.67కు చేరగా, ముంబైలో పెట్రోల్ రూ.85.70కి, డీజిల్‌ 76.11కు, కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.80.13, డీజిల్ ధర రూ. 72.53కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 82.27 డీజిల్ రూ. 75.29కు పెరుగగా, హైదరాబాద్‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర 52 పైసలు పెరుగుదలతో రూ.81.88కు, డీజిల్ ధర 60 పైసలు పెరుగుదలతో రూ.75.91కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 51 పైసలు పెరుగుదలతో రూ.82.27కు చేరింది. డీజిల్‌ ధర కూడా 59 పైసలు పెరుగుదలతో రూ.76.30కు ఎగసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles