అమరవీరడు కల్నల్ భిక్కుముళ్ల సంతోష్ బాబు పార్థీవదేహానికి ఇవాళ సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. లడఖ్ లోని గాల్వన్ లోయలో వద్ద సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణలో తన ప్రాణలను తృణప్రాయంగా వదలి మరీ దేశం కోసం వీరమరణం పోందిన సంతోష్ బాబు అంత్యక్రియలు ఇవాళ పూర్తైయ్యాయి. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు బంధువులను, స్థానికులను జిల్లా కలెక్టర్ టి. వినయ్కృష్ణారెడ్డి అనుమతించారు.
అయినా సరిగ్గా అంతిమయాత్ర జరిగే సమయానికి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చి.. సంతోష్ బాబు జోహర్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి, సంతోష్ బాబు .. అమర్ రహే, వందే మాతరం అంటూ పెద్ద పెట్టున చేసిన నినాదాల మధ్య ముందుగా విద్యానగర్ లోని సంతోష్ బాబు ఇంటి నుంచి ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ కూడలి, రైతు బజార్, పాత బస్టాండు, కోర్టు కూడలి, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. సంతోష్ బాబు అంతిమయాత్ర వెళ్లే దారి పోడవునా స్థానికులు తమ ఇళ్లు, భవనాలపైకి ఎక్కి సంతోష్ బాబుకు ఘన నివాళులు అర్పించారు.
సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సంతోష్ బాబు స్వగ్రామానికి ఆయన పార్థీవ దేహం అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో స్వగ్రామానికి చేరుకోవడంతో క్రితం రోజు జరగాల్సిన అంత్యక్రియలు ఇవాళ జరగాయి, సంతోష్ బాబు పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించారు, వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. మంత్రి జగదీశ్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంతోష్బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more