బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆకస్మిక మరణం ఎందరినో దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన అభిమానులు ఈ విషయాన్ని ఇప్పటికీ ఇంకా నమ్మలేకపోతున్నారు. ఇదంతా అబద్దమనే భావన వారిలో నెలకోంది. కానీ ఇది నిజమని వారు అంగీకరించక తప్పదు. ఇలాంటి తరుణంలో వారి కుటుంబాన్ని మరో విషాదం చుట్టుముట్టింది. ఆయన మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని సుశాంత్ కుటుంబంలో మరో వ్యక్తి కూడా మరణించారు. సుషాంత్ మరణవార్త తెలిసిన అతడి సోదరుడి భార్య.. (వరుసకు వదిన) అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పోందుతుంది. సరిగ్గా సుశాంత్ అంత్యక్రియలను ముంబైలో నిర్వహిస్తున్న సమయంలోనే ఆమె బీహార్ లోని పూర్ణియాలో కన్నుమూసింది.
సుశాంత్ మరణవార్త తెలిసి బిహార్ లోని అతడి సోదరుడు అంబ్రేంద్ర సింగ్ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే అప్పటికే కాలేయ కాన్సర్ ( లీవర్ క్యాన్సర్)తో బాధపడుతున్న అతని భార్య సుధాదేవి నుంచి ఈ విషయాన్ని కుటుంబసభ్యులు దాచారు. అయితే ఎలాగో ఆ విషయం ఆమె చెవిన పడింది. దీంతో తట్టుకోలేకపోయిన సుధాధేవి తన బిడ్డలాంటివాడు.. హీరోగా ఇప్పుడిప్పుడే చలనచిత్రరంగంలో తనకంటూ ఓ స్థాయిని ఏర్పర్చుకున్న సుశాంత్ ఆకస్మిక మరణం చెందాడని, అందులోనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసి ఆమె మరింతగా కుంగిపోయింది, నిద్రాహారాలు మాని బాధపడింది. ఇంట్లోని వారు ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఆమె మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు.
సరిగ్గా యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్0 బౌతికకాయానికి బందుమిత్రులు, అభిమానుల సమక్షంలో ముంబైలో అంతిమసంస్కారాలు నిర్వహిస్తన్న సమయంలోనే సుధాదేవి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సుశాంత్సింగ్ రాజ్పూత్ ఆదివారం ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ గత కొన్ని నెలలుగా డిప్రెషన్తో సతమతమవుతున్నారని పోలీసు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పూనుకున్నాడని సమాచారం. యావత్ లోకానికి చిచోరే సినిమాతో మానసిక వేదనను ఎలా అధిగమించవచ్చునని చూపించిన హీరోనే.. చివరకు దానికే బలయ్యాడన్న విషయం విషాదాన్ని తలపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more