Sushant Singh's sister-in-law dies in Bihar బాలీవుడ్ యువహీరో మరణాన్ని తట్టుకోలేక..

Unable to bear loss sushant singh rajputs sister in law dies in bihar

Sushant Singh Rajput Sister in Law Death News, Sushant Singh Rajput, Sushant Singh sister-in-law, sushant singh death, sushant singh news

After suicide by Bollywood actor Sushant Singh Rajput, his family has been struck by another blow with his ailing sister-in-law Sudha Devi passing away in Bihar's Purnia as 'she could not bear the loss of the actor'. She was suffering from liver cancer.

బాలీవుడ్ యువహీరో మరణాన్ని తట్టుకోలేక..

Posted: 06/16/2020 05:33 PM IST
Unable to bear loss sushant singh rajputs sister in law dies in bihar

బాలీవుడ్‌ యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్ పూత్‌ ఆకస్మిక మరణం ఎందరినో దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన అభిమానులు ఈ విషయాన్ని ఇప్పటికీ ఇంకా నమ్మలేకపోతున్నారు. ఇదంతా అబద్దమనే భావన వారిలో నెలకోంది. కానీ ఇది నిజమని వారు అంగీకరించక తప్పదు. ఇలాంటి తరుణంలో వారి కుటుంబాన్ని మరో విషాదం చుట్టుముట్టింది. ఆయన మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని సుశాంత్ కుటుంబంలో మరో వ్యక్తి కూడా మరణించారు. సుషాంత్ మరణవార్త తెలిసిన అతడి సోదరుడి భార్య.. (వరుసకు వదిన) అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పోందుతుంది. సరిగ్గా సుశాంత్ అంత్యక్రియలను ముంబైలో నిర్వహిస్తున్న సమయంలోనే ఆమె బీహార్ లోని పూర్ణియాలో కన్నుమూసింది.

సుశాంత్‌ మరణవార్త తెలిసి బిహార్ లోని అతడి సోదరుడు అంబ్రేంద్ర సింగ్‌ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే అప్పటికే కాలేయ కాన్సర్ ( లీవర్ క్యాన్సర్)తో బాధపడుతున్న అతని భార్య సుధాదేవి నుంచి ఈ విషయాన్ని కుటుంబసభ్యులు దాచారు. అయితే ఎలాగో ఆ విషయం ఆమె చెవిన పడింది. దీంతో తట్టుకోలేకపోయిన సుధాధేవి తన బిడ్డలాంటివాడు.. హీరోగా ఇప్పుడిప్పుడే చలనచిత్రరంగంలో తనకంటూ ఓ స్థాయిని ఏర్పర్చుకున్న సుశాంత్ ఆకస్మిక మరణం చెందాడని, అందులోనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసి ఆమె మరింతగా కుంగిపోయింది, నిద్రాహారాలు మాని బాధపడింది. ఇంట్లోని వారు ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఆమె మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు.

సరిగ్గా యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్0 బౌతికకాయానికి బందుమిత్రులు, అభిమానుల సమక్షంలో ముంబైలో అంతిమసంస్కారాలు నిర్వహిస్తన్న సమయంలోనే సుధాదేవి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఆదివారం ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్‌ గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో సతమతమవుతున్నారని పోలీసు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పూనుకున్నాడని సమాచారం. యావత్ లోకానికి చిచోరే సినిమాతో మానసిక వేదనను ఎలా అధిగమించవచ్చునని చూపించిన హీరోనే.. చివరకు దానికే బలయ్యాడన్న విషయం విషాదాన్ని తలపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles