India reaches 3,32,424 Covid-19 cases దేశంలో 24 గంట్లలో 11,502 కేసులు.. 325 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 332424 deaths toll 9520

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 11502 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. Positive cases tally reaches to 3,32,424 people have tested positive for coronavirus and 9520 have died due to the virus.

దేశంలో కరానా విజృంభన: 24 గంట్లలో 11,502 కేసులు.. 325 మరణాలు

Posted: 06/15/2020 02:15 PM IST
Coronavirus update covid 19 cases in india reaches 332424 deaths toll 9520

(Image source from: Timesnownews.com)

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో దేశంలో అమల్లోకి వచ్చిన తొలి అన్ లాక్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ఐదు వేల నుంచి ఎనమిది వేలకు ఎగబాకింది. ఆ తరువాత గత పక్షం రోజులుగా ప్రతీరోజు పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా ఇవాళ దానిని కూడా అధిగమించిన స్థాయిలో పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి, తాజాగా 11 వేల పైబడిన కేసులు దేశంలో నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో నమోదైన కేసులతో భారత్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ప్రభావిత దేశంగా నిలించింది.

ఈక్రమంలో దేశంలో మూడు లక్షల 9 వేల కరో్నా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండు లక్షల 96 వేల కేసులతో నాల్గవ స్థానంలో వున్న యైనైటెడ్ కింగ్ డమ్ ను భారత్ అధిగమించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన వివరాల మేరకు దేశంలో మునుపెన్నడూ నమోదుకాని సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 11,502 సాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్కు వైపు పరుగులు పెడుతోంది. గత వారం రోజులుగా ప్రతీరోజు పదకొండు వేలకు చేరడం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం 3,32,424మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 9520కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 325 మరణాలు సంభవించాయి.

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీలలో కరోనా ప్రభావం తీవ్రంగా వుంది. ఇక్కడ నుంచే రమారమి తాజా కేసులన్నీ నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. అటు మరణాలలోనూ మహారాష్ట్ర అధికంగా నమోదుచేసుకుంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మహరాష్ట్రలో 152 మరణాలు నమోదు చేసుకున్నాయి.

గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో దేశంలో కరోనా కేసులు నమోదు కాలేదు. వరుసగా అత్యధిక కేసులు నమోదు చేసుకుంటున్న దేశం ఇవాళ మరో అత్యధిక కేసుల మార్కును అందుకోవడం అందోళనకరం. ఇక ఇదే సమయంలో అటు దేశంలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 153,106 మంది దేశంలోని పలు ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 169,796మంది మాత్రం కరోనాబారిన పడి కోలుకున్నారని.. వరుసగా మూడో పర్యాయం దేశంలో బాధితుల సంఖ్య కన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. 

గత పన్నెండు రోజుల వ్యవధిలో దేశంలో ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. సరిగ్గా మే 18న లక్ష కేసులను నమోదైన దేశంలో కేవలం 26 రోజుల వ్యవధిలోనే మరో రెండు లక్షల కేసులను నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతోంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 24వేల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 3607 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏకంగా 152 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 97,648 కేసులు నమోదు కాగా, మొత్తంగా మూడున్నర వేల మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles