తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పంజావిసురుతున్నాయి, ఈ నెల 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఇక ఇక్కడ కూడా మార్కెట్ తో సంబందంతోనే కరోనా కేసులు వ్యాప్తిచెందడం మరో విశేషం. ఇప్పుడు వలస కూలీలకు అధికంగా వైరస్ సోకుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
శుక్రవారం నాడు విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 40 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1454కు చేరుకున్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 461 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 33 పాజిటివ్ కేసులను గుర్తించడం గమనార్హం. మరో ఏడుగురు వలస కూలీలకు కూడా కరోనా సోకింది. హైదరాబాద్లోని నాలుగు జోన్లలో తప్ప మరెక్కడా కొత్తగా కరోనా కేసులు లేవని బులెటిన్లో వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.
శుక్రవారం కరోనా నుంచి కోలుకొని 13 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారు 959 మందిగా వెల్లడించారు. పెద్ద సంఖ్యలో తెలంగాణకు వస్తున్న వలస కార్మికుల వల్ల అధికంగా కరోనా సోకుతోందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. సిద్దిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల్, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాలో గత 14 రోజుల వ్యవధిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more