High Court latest interm orders to andhra pradesh government ఏపీ సర్కారుకు రంగుల విషయంలో తాజా ఉత్తర్వులు..

High court latest interm orders to andhra pradesh government

AP CM YS Jagan, High Court, Government buildings, Government offices, Colours, supreme court, CM YS Rajashekar reddy, Andhra Pradesh, Politics

Andhra Pradesh Government had experienced another jolt in High Court as the apex court had passed the interm orders on changing the colours of Government buildings and offices.

ఏపీ సర్కారుకు రంగుల విషయంలో తాజా ఉత్తర్వులు..

Posted: 05/05/2020 04:07 PM IST
High court latest interm orders to andhra pradesh government

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో వైఎస్ జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ కార్యాలయాలను, భవనాలకు తమ పార్టీ రంగులు వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు నాలుగు రంగులు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను నిలిపివేస్తూ రాష్ట్రోన్నత న్యాయస్థానం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి వరుసగా హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు వేసిన వైసీపీ పార్టీ రంగలును తొలగించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాల తర్వాత మట్టి రంగును చేరుస్తూ ప్రభుత్వం జారీ చేసిన మరో జీవోపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టుకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో మరోసారి పిటీషన్లు దాఖలయ్యాయి.  దీంతో ఇటీవల దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇవాళ మద్యంతర ఉత్వర్లులను జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles