కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని ఎంత చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. ఊరికే తిని తొంగుంటే మనిషికి, పశువుకు పెద్ద తేడా ఉండదని కాబోలు కొందరు తమ ఇరుగుపోరుగు వారితో కలసి సరదాగా అటాడుకున్నారు. సమయం దొరికింది కదా అని కాలక్షేపానికి వారు తెరతీస్తే.. అదే మార్గంలో వారిని ప్రభావితం చేసింది కరోనా వ్యాధి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 39 మందికి కరోనా సోకింది. ఇది కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకుంది.
రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించిన మేరకు ఇలా వున్నాయి. కృష్ణలంకలో లారీ డ్రైవర్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని వివరించారు. తిరిగే కాలు ఒక్క చోటు కూర్చోమంటే ఎలా కూర్చుంటుందని.. తన ఇరుగుపోరుగు వారితో కాలక్షేపం చేయాలని భావించాడు. అంతే వారిని పిలిచి అతడు పేకాట ఆడాడని చెప్పారు. వీరితో పాటు ఇరుగు పొరుగు వారి పిల్లలు, మహిళలు కూడా హౌసీ ఆడారని కలెక్టర్ తెలిపారు. దీంతో మొత్తం 24 మందికి కరోనా సోకిందన్నారు.
ఇక విజయవాడలోని మరో ఘటనలో 15 మందికి ఇలాంటి చర్యల ద్వారానే కరోనా సోకింది. కార్మికనగర్ లో మరో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 15 మందికి కరోనా సోకిందని కలెక్టర్ వివరించారు. డ్రైవర్ తన కుటుంబ సభ్యులు, పొరుగువారిని కలవడం వల్ల వారికి కరోనా సోకిందని తెలిపారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఈ రెండు ఉదంతాలూ జరిగాయని కలెక్టర్ చెప్పారు. ప్రజలు భౌతికదూరం పాటించకుంటే కరోనా నియంత్రణ కష్టమని చెప్పారు. రెడ్జోన్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
రేపు మాంసం, చేపల అమ్మకంపై నిషేధం
విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో రేపు చికెన్, మటన్, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్ మూసివేస్తున్నట్టు వీఎంసీ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more