ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. మానవజాతి మనుగడకే సవాల్ విసురుతోంది. కరోనా మహమ్మారి ధాటికి అభివృధ్ది చెందిన దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై అవగాహన కల్పించి.. సామాజిక దూరం పాటించి.. చేతులను ఎప్పటికప్పుడు కడుకుంటూ వేడి వేడి పధార్థాలను మాత్రమే తీసుకోవాలని అటు అయుష్, ఇటు అయుర్వేద ప్రముఖులతో పాటు పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో కొందరు మాత్రం వితండవాదానికి తెరతీస్తూ. మద్యం తాగితే కరోనా రాదని పుకార్లు పుట్టిస్తున్నారు.
ఇదేమార్గంలో మరికొందరు మరో వార్తను కూడా విపరీతంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. హిందూదేశంగా బాసిల్లుతున్న భారతావనిలో ఇక్కడి ప్రజలు ఆచరించి, అధిక ప్రాధాన్యనిచ్చే సంస్కృతీ సంప్రదాయాలతోనూ ఆటలాడేందుకు సాహసిస్తున్నారు. అమావాస్య రోజున దేశంలోని ముత్తైదువులు పసుపుగొమ్మును తమ మెడలో కట్టుకుంటే వారకి కరోనా నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లదని ప్రచారం చేశారు. అంతేకాదు ఏకంగా ఏడు దారాలతో దారాన్ని ఒక్కటిగా పేనిన తరువాత దానితో పుసుపు గొమ్మును ముడి వేయాలని ఆ తరువాత దానిని కట్టుకోవాలని ప్రచారం విపరీతంగా జరిగింది.
దీంతో ఇలా చేసిన మహిళల కుటుంబాలను కరోనా వైరస్ తాకదని, తాకినా ఎలాంటి హాని తలపెట్టదని ఓ తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేశారు. మాంగాళ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే మహిళలు.. కుటుంబానికి కూడా అగ్రతాంబులం ఇవ్వడంతో.. ఈ వార్త నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. భారతదేశంలో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల్లోనే వుండటంతో ఈ వార్తకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని.. ఇందులో ఎలాంటి సత్యం లేదని మరికొందరు వాదిస్తున్నారు. హేతువాదులైతే ఇది కేవలం కొందరు చేస్తున్న విషప్రచారమని అన్నారు.
విపరీతంగా ప్రచారం పొందుతున్న ఈ వార్తపై శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి స్పష్టతనిచ్చారు. ముత్తైదువులు అమావాస్యలోపు 7 దారాలతో పుసుపుకొమ్ములు ధరించాలని వస్తున్న వాదనలు అవాస్తవమని తేల్చిచెప్పారు. అమావాస్య తర్వాత వాటిని తీసివేయాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే అందరికీ మానసిక బలం చేకూరుతుందని హితవు పలికారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుడిని స్మరించాలని సూచించారు. ఏ రోగమైనా నివారణకు వైద్య చికిత్స మాత్రమే మార్గమని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more