లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ప్రజలందరినీ ఇళ్లకు మాత్రమే పరిమితం చేసిన నేపథ్యంలో దేశప్రజలందరికీ ఇది ఒక తరహాలో శిక్షలాంటిదేనని.. దీని నుంచి వారు ఉపశమనం పొందాలంటే కేంద్రప్రభుత్వం వారికి కొన్నింటిని ఉచితంగా అందించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాజ్యం దాఖలైంది. అవేంటంటే అపరిమితి కాలింగ్, డేటా, డీటీహెచ్ సదుపాయాలు. వీటిని ఉచితంగా అందించాలని మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజల మానసిక ఒత్తిడిని దూరం చేయాలంటే ఇది తప్పనిసరని పేర్కొన్నారు. నిర్బంధంలో ఉండటంతో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకొనేలా ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ఆయన కోరారు.
అన్ని ఛానళ్లు వచ్చేలా డీటీహెచ్ సేవలు ఉచితంగా అందించేలా ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ను ఆదేశించాలని వ్యాజ్యంలో ప్రతాప్ కోరారు. వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఉచితంగా వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అపరిమితంగా ఆడియో, వీడియో కాలింగ్, డేటా, డీటీహెచ్ ద్వారా లాక్డౌన్లో ప్రజల మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. వలస కూలీలు, పేదలకు ఉచితంగా ఆహారం, బస అందిస్తున్నప్పటికీ పౌరులపై నానాటికీ పెరుగుతున్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
‘శారీరక ఆరోగ్యం మాదిరిగానే మానసిక ఆరోగ్యం అత్యంత కీలకం. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లాక్డౌన్లో చాలామంది తమ కుటుంబాలు, సన్నిహితులకు దూరంగా ఉన్నారు. వారు కుంగుబాటుకు లోనవుతున్నారు. క్వారంటైన్, ఐసోలేషన్లో కొందరు ఆత్యహత్య చేసుకొనేందుకు ప్రయత్నించారు. అపరిమితంగా ఉచిత ఆడియో, వీడియో కాలింగ్, డేటా, డీటీహెచ్ సదుపాయాలు కల్పిస్తే కుటుంబాలకు దూరమైన వారికి ఉపశమనం కలుగుతుంది. క్వారంటైన్ కేంద్రాల్లోనూ ఇంటర్నెట్, టీవీ సేవలు ఉండాలి’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more