కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. అయితే తమ పనితీరుతో ఇలా ప్రశంసలను అందుకున్న పోలీసులు ఆదమరచి మరీ విధులు నిర్వహించడమే ఇప్పుడు వారిని వార్తల్లో నిలిచేలా చేసింది. అదేంటి అదమరచి విదులు నిర్వహించమేంటి.? అనుకుంటున్నారా.? ఔనండీ.. తాము ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగతి కూడా మర్చిపోయారు.
కర్ణాటకకు వెళ్లి ఆ హోం మంత్రి కారును తమిళనాడు పోలీసులు ఆపేశారు. మంత్రిని అని చెప్పినప్పటికీ ఐడీ కార్డు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆరాలు తీశారు. ఈ ఘటనకు కర్ణాటక హోం మంత్రి అవాక్కయ్యారు. వెంటనే ప్రాంతంలోని రూరల్ పోలీసులను పిలిపించారు. ఎస్పీ రవి డీ చన్నావర్ రాగానే తమిళనాడు పోలీసులు బోర్డర్ దాటి వచ్చిన తర్వాత విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా తమిళనాడు పోలీసులు కర్ణాటక బోర్డర్లో బారికేడ్లు పెట్టారంటూ బొమ్మాయ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఆయన పోస్టు సారాంశం సాగిందిలా.. ‘‘ఈ రోజు నేను నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లాను. పలు ప్రాంతాలు తిరిగిన అనంతరం.. తమిళనాడు పోలీసులు కర్ణాటక బోర్డర్లో బారికేడ్లు పెట్టి ఉండటం గమనించాను. బెంగళూరు పోలీసులను పిలిపించి బారికేడ్లు తీయించాను’’ అని పోస్టు చేశారు. ఇక దీనిపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ రవి.డి చన్నావర్ మాట్లాడుతూ.. తమిళనాడు పోలీసులు కర్ణాటకలోకి వచ్చేసి బారికేడ్లు పెట్టారు. వాటిని మేం చెప్పిన వెంటనే తొలగించారని అని అన్నారు.
వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ లు ఉన్నారు. అయితే వీరికి కూడా రాష్ట్ర సరిహద్దులపై పెద్దగా అవగాహన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, కర్ణాటక హోం మంత్రిని తమిళనాడు పోలీసులు ప్రశ్నించిన దానిపై వార్తల్లోకి వచ్చిన తర్వాత సర్దిచెప్పుకున్నారు. మంతివర్యులకు సాయం చేసేందుకే మేం అక్కడికి వచ్చామని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ఈ వార్త రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more