దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ బారిన అనేక మంది పడ్డారు. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ 24 గంటల వ్యవధిలో మరో 460 మందిని తన భారిన వేసుకుంది. ఇప్పటికే గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకుంటోంది. ఫలితంగా గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5734కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా నూటయాభై మార్కు దాటిపోయింది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 472 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గణంకాలను వెలువరించింది.
గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 460 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వచ్చే వారంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1, 135 మంది కరోనాతో వైరస్ బారిన పడ్డారు. ఆ తరువాత తమిళనాడు లో 738 మంది, ఢిల్లీలో 669 మంది, తెలంగాణలో 427, రాజస్తాన్ లో 381 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటు అంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంక్య 348కి చేరిందని కేంద్ర అరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 17 మరణాలతోపాటు పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. రానున్నరోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 72మంది మృత్యువాతపడగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1135కి చేరింది. ఆ తరువాత మరణాల సంఖ్య గుజరాత్ లో 16కు చేరగా, మధ్యప్రదేశ్ లో 13కు చేరింది. ఢిల్లీలో 9, పంజాబ్ లో 8, తమిళనాడులోనూ 8, కర్ణాటకలో ైదు, పశ్చమ బెంగాల్ లో 5 మరణాలు సంభవించాయి,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more