కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుననే అన్ని చర్యలకు తమ పార్టీ తరపున మద్దతుఇస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేసేందుకు ప్రజలందరూ కలసి ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఏర్పడిందని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో కలసి ప్రజలందరూ నడవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి ఓనర్లు అద్దెలు అడగవద్దని.. ప్రైవేటు పరిశ్రమలు తమ కార్మికులకు వేతనాలల్లో కోతలు విధించవద్దని అంక్షలు పెట్టిన ముఖ్యమంత్రి.. తాను చెప్పదోకటి.. చేసేది మరోకటని తేలిపోయిందన్నారు. ప్రభుత్వమే తమ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంతో.. ప్రైవేటు కార్మికుల నుంచి అన్ని వర్గాల ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని.. ఇది సముచితం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రానికి వారం రోజులు రాబడి రాకుంటే వేతనాల్లో కోత విధిస్తారా?. తక్షణమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రైవేటు సంస్థలు, ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఎందుకు కోత విధిస్తోంది? రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. దాదాపు పది వేల కోట్ల రాబడి వస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు, పెన్షనర్లకు కోత విధించడం సరికాదు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
అంతకుముందు పార్టీ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయమై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉద్యోగుల వేతనాల్లో కొత విధించే చర్యలకు తాము వ్యతిరేకమన్నారు. ధనిక రాష్ట్రం అని చెబుతూనే.. ప్రస్తుత ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కేవలం 8 రోజుల లాక్ డౌన్ లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more