komati Reddy fires on TS Govt over salaries cut కరోనా నియంత్రణకు సహకరిస్తాం.. కోతలను వ్యతిరేకిస్తాం: కోమటిరెడ్డి

Coronavirus alert komati reddy venkat reddy fires on ts govt over salaries cut

coronavirus in india, coronavirus, covid-19, corona spread, CM KCR, Komati Reddy Venkat Reddy, salaried cut, Employees cut, excess income state, Telangana, daily labour, chief secretaries all states, coronavirus, coronavirus lockdown 21, courts, covid19, justice nv ramana, justice ravindra bhat, migrant workers, supreme court, coronavirus updates, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus live update india, coronavirus in india new delhi, dialy labour, coronavirus in india latest news

Telangana senior congress leader and membe of Parliament Komati Reddy Venkat Reddy fires on Telangana Government over salaries cut for Employees.

కరోనా నియంత్రణకు సహకరిస్తాం.. కోతలను వ్యతిరేకిస్తాం: కోమటిరెడ్డి

Posted: 04/01/2020 02:50 PM IST
Coronavirus alert komati reddy venkat reddy fires on ts govt over salaries cut

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలను కాంగ్రెస్‌ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కరోనావైరస్ తో పోరాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కాగా.. కరోనా నేపత్యంలో ఉద్యోగుల వేతనాల్లో కొత విధించే చర్యలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.  యావత్ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూనే.. ప్రస్తుత ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారని.. కేవలం 8 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే సీఎం కేసీఆర్‌.. ఇపుడు ఆర్థిక లోటు అనటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. చాలిచాలని జీతాలతో బదుతకులీడుస్తున్న క్లాస్-4 ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై కూడా కోతను విధించడం దారుణమని కొమటిరెట్టి మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే ప్రైవేటు సంస్థలు నడిస్తే.. ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేసే కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందని.. అందుకు కారణం ఎవరని ఆయన నిలదీశారు. పింఛన్ తో జీవితాన్ని గడుపుతున్న వారు తాజా నిర్ణయంతో రోడ్డున పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని క్రమశిక్షణ లేక అప్పుల రాష్ట్రంగా మార్చారని కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారుల జీతాల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ మరోసారి సమీక్షించాలని.. ప్రస్తుత ఆర్థిక లోటుపై వారంలోగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles