రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలను కాంగ్రెస్ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కరోనావైరస్ తో పోరాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కాగా.. కరోనా నేపత్యంలో ఉద్యోగుల వేతనాల్లో కొత విధించే చర్యలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. యావత్ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూనే.. ప్రస్తుత ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారని.. కేవలం 8 రోజుల లాక్డౌన్లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే సీఎం కేసీఆర్.. ఇపుడు ఆర్థిక లోటు అనటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. లాక్డౌన్ కాలంలో ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. చాలిచాలని జీతాలతో బదుతకులీడుస్తున్న క్లాస్-4 ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై కూడా కోతను విధించడం దారుణమని కొమటిరెట్టి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే ప్రైవేటు సంస్థలు నడిస్తే.. ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేసే కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందని.. అందుకు కారణం ఎవరని ఆయన నిలదీశారు. పింఛన్ తో జీవితాన్ని గడుపుతున్న వారు తాజా నిర్ణయంతో రోడ్డున పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని క్రమశిక్షణ లేక అప్పుల రాష్ట్రంగా మార్చారని కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారుల జీతాల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించాలని.. ప్రస్తుత ఆర్థిక లోటుపై వారంలోగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more